News March 16, 2024

సీఏఏ అమలుపై సుప్రీంకోర్టుకు ఒవైసీ

image

పౌరసత్వ సవరణ చట్టం అమలును సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులను 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6బీ ప్రకారం స్వీకరించొద్దన్నారు. ప్రభుత్వం అఫ్గాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం ఇవ్వొచ్చు కానీ మతం ఆధారంగా ఇవ్వకూడదని ఒవైసీ ఇటీవల సూచించారు.

Similar News

News December 2, 2025

వరంగల్: 19 పంచాయతీలు ఏకగ్రీవం!

image

ఉమ్మడి జిల్లాలో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. జనగామలో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, తరిగొప్పుల మండలాల్లో ఆరు పంచాయతీలు, వర్ధన్నపేట, రాయపర్తిలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. భూపాలపల్లిలో చెంచుపల్లి, మహబూబాబాద్‌లో మూడు పంచాయతీలు ఒక్కో నామినేషన్‌తో ఏకగ్రీవం కావడం ప్రత్యేకత.

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News December 2, 2025

CTETకు దరఖాస్తు చేశారా?

image

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్‌, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/