News October 26, 2024
Oxford University: భారతీయురాలి కలల్ని చిదిమేసింది

Oxford Universityలో ఇంగ్లిష్లో PhD చేస్తున్న TNకు చెందిన లక్ష్మీ బాలకృష్ణన్కు నిరాశే మిగిలిందే. PhD కోసం ₹కోటి వరకు ఫీజు చెల్లించిన యువతి నాలుగో ఏడాదిలో షేక్స్పియర్పై చేసిన రీసెర్చ్ PhDకి తగ్గ స్థాయిలో లేదని చెప్పి వర్సటీ ఆమెను బలవంతంగా మాస్టర్స్కు బదిలీ చేసింది. రీసెర్చ్ ఆశించిన స్థాయిలో ఉండాలని, అందరూ దాన్ని సాధించలేరని వర్సిటీ పేర్కొంది. మోసపోయానని లక్ష్మీ ఆవేదన చెందింది.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


