News March 30, 2025
నేడు పీ-4 కార్యక్రమం ప్రారంభం

AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
Similar News
News April 1, 2025
పిల్లల విషయంలో.. తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.
News April 1, 2025
రూ.11 లక్షల జీతంతో ఉద్యోగాలు

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 182 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని పోస్టులకు BE, బీటెక్, ME, డిగ్రీ, CA, తదితర విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. అన్ని పోస్టులకు వార్షిక వేతనం రూ. 11లక్షలు కాగా, వయసు 30ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమై వచ్చే నెల 1తో ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.ngel.in/careerను సంప్రదించండి.
News April 1, 2025
BREAKING: ఫలితాలు విడుదల

IBPS నిర్వహించిన 11,826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA)-క్లర్క్ పోస్టుల మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <