News March 17, 2024
ప.గో.: 9వ తరగతి చదివి వైసీపీ MLA అభ్యర్థిగా

ప.గో. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల చదువులు ఇలా..
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- 9వ తరగతి
కొట్టు సత్యనారాయణ – ఇంటర్
గుడాల శ్రీహరిగోపాల రావు – బీకాం
పెన్మెత్స వెంకట లక్ష్మీ నర్సింహరాజు – బీఏ
గ్రంథి శ్రీనివాస్ – ఇంటర్
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు – ఇంటర్
ఆళ్ల నాని – బీకాం
తానేటి వనిత – MSC (PHD)
అబ్బయ్య చౌదరి – బీటెక్
కంభం విజయరాజు – BA, ఎల్ఏఈ
తెల్లం రాజ్యలక్ష్మి- BA, బీఈడీ
పుప్పాల శ్రీనివాసరావు – డిగ్రీ
Similar News
News October 26, 2025
ప.గో: రైతులకు తుఫాను భయం

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.
News October 25, 2025
జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.


