News March 17, 2024

ప.గో: వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్.. 3Hrs టెన్షన్

image

ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి ఎట్టకేలకు కిందికి దిగాడు. వేల్పూరు గ్రామానికి చెందిన యరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను కిందకు దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3గంటల అనంతరం అతడు కిందికి దిగాడు.

Similar News

News April 2, 2026

కిక్కెక్కిస్తున్న ప.గో: మద్యం అమ్మకాల్లో టాప్-6లో జిల్లా!

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 2, 2026

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడిన ఆమె.. పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 2, 2026

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడిన ఆమె.. పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.