News September 16, 2024

కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్య

image

AP: నామినేటెడ్ పదవుల భర్తీని NDA కూటమి ప్రారంభించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ IAS అయిన కృష్ణయ్య మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో APIIC ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

Similar News

News January 29, 2026

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్‌పోర్ట్స్<<>> అథారిటీ ఆఫ్ ఇండియా 30 అసోసియేట్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు నేటి నుంచి FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.70,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aai.aero

News January 29, 2026

మరణించిన వ్యక్తి కలలో వచ్చారా?

image

మరణించిన వ్యక్తులు కలలో కనిపించడం అశుభం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇది మనసులోని బలమైన జ్ఞాపకాలకు, వారిపై ఉన్న ప్రేమకు ప్రతిబింబం. మృతులు కలలో కనిపించడం అంటే మీ జీవితంలో ఓ దశ ముగిసి, కొత్త మార్పులు మొదలవుతున్నాయని అర్థం. కొన్నిసార్లు వారు మనల్ని మార్గదర్శనం చేయడానికి కూడా రావచ్చు. మనసులో ఒత్తిడి, అసంపూర్తి కోరికల వల్ల కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఆందోళన చెందక, మానసిక సంకేతంగా చూడటం మంచిది.

News January 29, 2026

చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

image

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.