News March 19, 2025

P4పై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం

image

పేదరిక నిర్మూలన కోసం తలపెట్టిన P4 పాలసీ(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌ షిప్)ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు మేధావులు, ఎన్జీఓలు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

Similar News

News November 22, 2025

తిరుపతి: వారికి ధరల పెంపు

image

తిరుపతి జిల్లాలోని 2,283 స్కూళ్లలో 3,472మంది మధ్యాహ్న భోజనం తయారీ చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనం రూ.3వేలు ఇస్తారు. అలాగే ఒక్కో విద్యార్థికి(1 నుంచి 5వతరగతి) రూ.5.45, 6 నుంచి ఇంటర్ విద్యార్థులకు రూ.8.17 చొప్పున డబ్బులు ఇస్తారు. వీటితో కూరగాయలు, వంట నూనె, పప్పులు కొనుగోలు చేస్తారు. ఈ నగదు సరిపోవడం లేదని వంటవాళ్లు అంటున్నారు. దీంతో ప్రభుత్వం రూ.5.45 నుంచి రూ.6.19కి, రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచింది.

News November 22, 2025

ఎర్రచందనం పరిరక్షణకు నిధుల విడుదల

image

ఎర్రచందన చెట్ల సంరక్షణపై నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర అటవీ శాఖకు ₹38.36 కోట్లు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డుకు రూ.1.48 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే ఎర్రచందనం వేలంతో రాష్ట్ర ప్రభుత్వానికి ₹87.68 కోట్లు వచ్చాయి. అదనంగా AP బయోడైవర్సిటీ బోర్డు ద్వారా లక్ష ఎర్రచందనం మొక్కల పెంపకానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు.

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.