News March 19, 2025
P4పై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం

పేదరిక నిర్మూలన కోసం తలపెట్టిన P4 పాలసీ(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్ షిప్)ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు మేధావులు, ఎన్జీఓలు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
Similar News
News November 20, 2025
జగిత్యాల: ‘గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి’

గ్రామపంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. తుది ఓటర్ లిస్ట్పై వచ్చిన అభ్యంతరాలను 22వ తేదీలోపు పరిష్కరించాలని, 23 నాటికి పోలింగ్ స్టేషన్లు, ఫొటో ఓటర్ జాబితా ప్రకటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, SP అశోక్ కుమార్ పాల్గొన్నారు.
News November 20, 2025
యడ్లపల్లిలో తల్లిని చంపి కూతురు పరార్..!

చుండూరు మండలం యడ్లపల్లిలో బుధవారం తల్లిని కూతురు చంపిన ఘటన చోటుచేసుకుంది. చుండూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ దయావతి (84)ని ఆమె కూతురు లక్ష్మీ భవాని కుంకుడుకాయలు కొట్టే రాయితో తలపై కొట్టి హత్య చేసింది. హత్య అనంతరం కూతురు పరారైంది. స్థానికులు ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
News November 20, 2025
VKB: నార్మల్ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: స్వర్ణ కుమారి

సిజరిన్ డెలివరీలు కాకుండా నార్మల్ డెలివరీలు అయ్యేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయన వైద్య సిబ్బందితో డాక్టర్లతో సమావేశమై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలకు సరైన విధంగా సేవలందించాలన్నారు.


