News March 17, 2025

ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

image

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.

Similar News

News November 14, 2025

రాష్ట్రంలో మరో 2 ఉపఎన్నికలు.. జోరుగా చర్చ

image

TG: ఫిరాయింపు MLAలపై స్పీకర్ విచారణ కొనసాగుతుండడం తెలిసిందే. వీరిలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి‌(ఘన్‌పూర్) అఫిడవిట్లూ ఇవ్వలేదు. పార్టీ మారినట్లు కడియం చెప్పగా దానం ఏకంగా CONG అభ్యర్థిగా SEC MP ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా WBలో TMCలో చేరిన BJP MLAపై వేటుపడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ 2చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ మొదలైంది. ఈ 2 స్థానాల్లోనూ గెలుస్తామని CONG చెబుతోంది.

News November 14, 2025

హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం

image

హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న NDA అభ్యర్థి, జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. బిహార్ మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్‌ మర్డర్ కేసులో నవంబర్ 2న అరెస్టయ్యారు. అనంత్ కుమార్ సింగ్‌కు 91,416, వీణా దేవికి 63,210 ఓట్లు దక్కాయి.

News November 14, 2025

18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.