News March 16, 2024

ప.గో: సామాజిక వర్గాల వారీగా వైసీపీ అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి 9 మంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికలో బరిలో నిలుస్తున్నారు.

Similar News

News February 3, 2026

ఈనెల 5న ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా: కలెక్టర్

image

వాసవి పెనుగొండ లో ఈనెల 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా‌ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News February 2, 2026

పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.

News February 2, 2026

భీమవరం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

image

భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామ శివారులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.