News March 17, 2024

పాడేరు: మోదకొండమ్మ జాతరకు తేదీలు ఖరారు

image

మన్యం ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి అధ్యక్షతన ఆదివారం అమ్మవారి ఆలయంలో పురోహితులు సుబ్రహ్మణ్యశాస్త్రి ఆయా తేదీలను నిర్ణయించారు. త్వరలో ఉత్సవ కమిటీ వేయనున్నారు.

Similar News

News September 3, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

CM చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. బీచ్ రోడ్డులోని ఓ రిసార్ట్‌లో నేషనల్ మీడియేషన్‌కు CM హాజరవుతారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా రుషికొండ చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ సూర్యకాంత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు.

News September 3, 2025

విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మాడగడకు పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5వ తేదీన అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ద్వారా అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నిర్వహించనున్న బలిపోరోబ్ ముగింపు ఉత్సవంలో పాల్గొనున్నారు. 3:30కి మాడగడ నుంచి తిరిగి పయణమై సాయంత్రం 5:30కి తిరిగి విశాఖ చేరుకుంటారు.

News September 3, 2025

స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులకు అందని జీతాలు..!

image

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ప్రతినెల జీతంలో 75% మాత్రమే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు మూడు రెట్ల జీతం యాజమాన్యం బకాయి పడిందన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.