News May 19, 2024
తిరుమలలో కనుల పండువగా పద్మావతి పరిణయోత్సవాలు

AP: తిరుమలలో పద్మావతి పరిణయోత్సలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి బయలుదేరగా.. ఆయన వెంట స్వర్ణపల్లకీలో శ్రీదేవి, భూదేవి అనుసరిస్తూ నారాయణగిరి ఉద్యానానికి చేరుకున్నారు. అనంతరం బంగారు తిరుచ్చిపై తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.
Similar News
News December 6, 2025
GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
TODAY HEADLINES

* గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్
* రష్యా ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ
* ముగిసిన పుతిన్ పర్యటన.. కీలక ఒప్పందాలు
* 1000 ఇండిగో సర్వీసులు రద్దు.. CEO సారీ
* వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: CBN
* DEC 30, 31, JAN 1వ తేదీల్లో సాధారణ దర్శనాలు రద్దు: TTD
* ఇందిరమ్మ ఇల్లులేని ఊరు లేదు: రేవంత్
* ‘హిల్ట్’ కేసు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
* అఖండ-2 సినిమా విడుదల వాయిదా
News December 6, 2025
త్వరలో అఖండ-2 మూవీ కొత్త రిలీజ్ డేట్

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన <<18465729>>అఖండ-2<<>> చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. రేపైనా సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.


