News May 19, 2024
తిరుమలలో కనుల పండువగా పద్మావతి పరిణయోత్సవాలు

AP: తిరుమలలో పద్మావతి పరిణయోత్సలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి బయలుదేరగా.. ఆయన వెంట స్వర్ణపల్లకీలో శ్రీదేవి, భూదేవి అనుసరిస్తూ నారాయణగిరి ఉద్యానానికి చేరుకున్నారు. అనంతరం బంగారు తిరుచ్చిపై తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.
Similar News
News February 25, 2026
శర్వానంద్ మాస్ లుక్

శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోగి’ నుంచి ఆయన లుక్ విడుదలైంది. అందులో శర్వా మాస్ లుక్లో కనిపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చేతిలో ఆయుధంతో దర్శనమిచ్చారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కాబోతోంది.
News February 25, 2026
ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.
News February 25, 2026
మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.


