India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్తో శ్రీలంక తలపడతాయి. రేపు సౌతాఫ్రికాVSవెస్టిండీస్, ఇండియాVSన్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్ స్టార్ యాప్లో చూడవచ్చు.
మంత్రి సురేఖ తన <<14254371>>వ్యాఖ్యల్ని<<>> వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని సినీ హీరో సుశాంత్ డిమాండ్ చేశారు. ‘రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రి నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడటం విని షాక్ అయ్యాను. ఎవరినీ బాధపెట్టి ఇలా రాజకీయాల్లోకి లాగకూడదు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.
AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.
ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.
చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ‘మా జట్టులో అక్షర్, స్టబ్స్, జేక్ ఫ్రేజర్, కుల్దీప్, పొరెల్, ముకేశ్, ఖలీల్ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. అవకాశం ఉంటే అందర్నీ రిటైన్ చేసుకుంటాం. మా ఓనర్ జీఎమ్మార్, డైరెక్టర్ గంగూలీతో చర్చించాక రిటైన్ లిస్ట్ తయారు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
TG: కాంగ్రెస్ అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినట్లు X ద్వారా వెల్లడించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని పేర్కొన్నారు. ‘మీ సీఎం, మంత్రిని మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు.
తేది: అక్టోబర్ 3, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:03 గంటలకు
ఇష: రాత్రి 7.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.