News October 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 3, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 3, గురువారం
ఆశ్వయుజ పాడ్యమి: రా.2.58 గంటలకు
హస్త: మ.3.32 గంటలకు
వర్జ్యం: రా.12.34 నుంచి రా.2.22 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.9.57 నుంచి ఉ.10.44 గంటల వరకు
(2) మ.2.43 నుంచి మ.3.30 వరకు
రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు

News October 3, 2024

గడ్డం గీయించుకుంటుంటే ఢీ కొట్టిన ట్రక్కు!

image

మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఊహించడం అసాధ్యం. UPలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. చాంద్‌వారీ గ్రామానికి చెందిన రాజేశ్(55) హైవే పక్కన ఉన్న ఓ సెలూన్‌లో గడ్డం గీయించుకుంటున్నారు. అదే సమయానికి హైవేపై వెళ్తున్న ఓ డీసీఎం ట్రక్కు అదుపు తప్పింది. సరిగ్గా ఆ సెలూన్ షాపుపైకి దూసుకెళ్లింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మరణించారు. షాపులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు.

News October 3, 2024

TODAY HEADLINES

image

* నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కారణం KTR: మంత్రి కొండా సురేఖ
* నా విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
* మంత్రి సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నాగార్జున, చైతూ
* 24 గంటల్లో సురేఖ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
* AP: నేటి నుంచి చెత్త పన్ను రద్దు: చంద్రబాబు
* AP: పార్టీలో కష్టించేవారికే అండగా ఉంటా: జగన్
* రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
* హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం

News October 3, 2024

ఆర్మీకి బులెట్‌ప్రూఫ్ జాకెట్స్.. DRDO, ఐఐటీ-డి తయారీ

image

రక్షణ పరిశోధనా అభివ‌ృద్ధి సంస్థ(DRDO), ఢిల్లీ ఐఐటీ కలిసి భారత సైన్యం కోసం బులెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేశాయి. వీటికి ‘అభేద్’గా పిలుస్తున్నాయి. ఏకే-47, స్నైపర్ తూటాలను కూడా తట్టుకోగల సామర్థ్యం వీటి సొంతమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న జాకెట్లకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయని, 8 తూటాలను ఆపగలవని వివరించారు. వీటి ఉత్పత్తిని 3 సంస్థలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.

News October 3, 2024

టీమ్ ఇండియా ఇంగ్లండ్‌ను కాపీ కొట్టింది: మైకేల్ వాన్

image

బంగ్లాతో రెండో టెస్టులో దూకుడు విషయంలో భారత్ ఇంగ్లండ్‌ను కాపీ కొట్టిందని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. ‘భారత్ కచ్చితంగా ఇంగ్లండ్ బాజ్‌బాల్‌ను కాపీ కొట్టింది. ఈ విషయంలో టీమ్ ఇండియా వద్ద ఇంగ్లండ్ ఏమైనా ఛార్జీలు వసూలు చేయొచ్చా?’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్ని ఆస్ట్రేలియా మాజీ కీపర్ గిల్‌క్రిస్ట్ సరిచేశారు. గంభీర్ కోచింగ్‌లో ‘గామ్‌బాల్’ను భారత్ ఆడుతోందని పేర్కొన్నారు.

News October 3, 2024

ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం: బాత్రూమ్‌కు పాకుతూ వెళ్లిన దివ్యాంగుడు

image

ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఓ దివ్యాంగుడు బాత్రూమ్‌కి పాకుతూ వెళ్లిన ఘటన ఇది. ఫ్రాంక్ గార్డెనర్ BBCలో సెక్యూరిటీ కరెస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా పోలాండ్ నుంచి లండన్ వెళ్లేందుకు LOT సంస్థకు చెందిన విమానం ఎక్కారు. ప్రయాణంలో బాత్రూమ్‌కు వెళ్లేందుకు చక్రాల కుర్చీ అడగ్గా సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన పాకుతూనే వెళ్లారు. ట్విటర్‌లో ఈ విషయాన్ని తెలిపి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News October 3, 2024

వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు: చైతూ

image

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగచైతన్య తప్పుబట్టారు. ‘విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం. నా మాజీ భార్య, నా కుటుంబం కోసమే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను. ఈరోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాస్యాస్పదం, ఆమోదయోగ్యం కానివి. మహిళకు మద్దతిస్తూ గౌరవించాలి. వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు’ అని అన్నారు.

News October 3, 2024

కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కోన వెంకట్

image

నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దారుణమని సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. ‘నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలి. ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలి. దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News October 3, 2024

క్యాబినెట్ మంత్రితో అదానీ ఎందుకు భేటీ అయ్యారు: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇవాళ సాయంత్రం ITC కోహినూర్‌లో తెలంగాణ క్యాబినెట్‌లో రెండో ర్యాంకు వ్యక్తితో అదానీ ఎందుకు భేటీ అయ్యారు? ఇంకా ముఖ్యంగా ఆ సమావేశంలో సునీల్ కనుగోలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌కు అదానీ ఫ్రెండ్ అయ్యారా? లేక రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన భూమిని కాజేయడానికా?’ అని ప్రశ్నిస్తూ KTR ట్వీట్ చేశారు.