India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లార్డ్స్లో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్లను నితీశ్ కుమార్ పెవిలియన్కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.
TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.
8th పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది అమలైతే జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని Ambit Capital(ఫైనాన్షియల్ అడ్వైజర్) అంచనా వేసింది. 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది. కాగా కొత్త పే స్కేల్ 2026 JAN నుంచి అమలవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
TG: పునర్విభజన సమయంలో APలో కలిపిన 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడును తిరిగి TGలో విలీనం చేయాలని AP CM చంద్రబాబుకు BRS MLC కవిత లేఖ రాశారు. పోలవరం ముంపు పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా విలీనం చేసుకున్నారని ఆరోపించారు. ఫలితంగా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకొని TGలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని కవిత దుయ్యబట్టారు.
భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. ‘మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే’ అని భర్త విఘ్నేశ్తో తీసుకున్న ఫొటోను ఇన్స్టాలో స్టోరీగా పెట్టారు. వీరికి 2022లో పెళ్లి కాగా ఇద్దరు కుమారులు(ట్విన్స్) ఉన్నారు. విఘ్నేశ్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లిరిసిస్ట్గా ఉన్నారు. ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులకు <<17015895>>పాఠాలు<<>> బోధించారు. అయితే, ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తరగతి గదిలోకి వెళ్లి పాఠం చెప్పడం చాలా అరుదు. ఒక వేళ మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇలాగే ఓ సీఎం వచ్చి మీకు క్లాస్ చెబితే ఎలా ఫీల్ అవుతారు? అలాగే, మీ స్కూల్లో ఏ మార్పులు చేస్తే బాగుంటుందని ఆయన్ను కోరతారు? కామెంట్ చేయండి.
TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. గోదావరి జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చ జరగనుంది.
బిహార్లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిటిజన్షిప్ నిర్ధారణకు JUN 24న ECI సబ్మిట్ చేసిన 11రకాల డాక్యుమెంట్లు కూడా సమగ్రమైనవి కాదంది. సిటిజన్షిప్ నిర్ధారించాల్సింది ECI కాదని పేర్కొంది. JUL 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను JUL 28కి వాయిదా చేసింది.
Sorry, no posts matched your criteria.