India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎయిర్లైన్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఓ దివ్యాంగుడు బాత్రూమ్కి పాకుతూ వెళ్లిన ఘటన ఇది. ఫ్రాంక్ గార్డెనర్ BBCలో సెక్యూరిటీ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. తాజాగా పోలాండ్ నుంచి లండన్ వెళ్లేందుకు LOT సంస్థకు చెందిన విమానం ఎక్కారు. ప్రయాణంలో బాత్రూమ్కు వెళ్లేందుకు చక్రాల కుర్చీ అడగ్గా సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన పాకుతూనే వెళ్లారు. ట్విటర్లో ఈ విషయాన్ని తెలిపి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగచైతన్య తప్పుబట్టారు. ‘విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం. నా మాజీ భార్య, నా కుటుంబం కోసమే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నాను. ఈరోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాస్యాస్పదం, ఆమోదయోగ్యం కానివి. మహిళకు మద్దతిస్తూ గౌరవించాలి. వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు’ అని అన్నారు.
నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దారుణమని సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. ‘నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టాలి. ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలి. దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇవాళ సాయంత్రం ITC కోహినూర్లో తెలంగాణ క్యాబినెట్లో రెండో ర్యాంకు వ్యక్తితో అదానీ ఎందుకు భేటీ అయ్యారు? ఇంకా ముఖ్యంగా ఆ సమావేశంలో సునీల్ కనుగోలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్కు అదానీ ఫ్రెండ్ అయ్యారా? లేక రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన భూమిని కాజేయడానికా?’ అని ప్రశ్నిస్తూ KTR ట్వీట్ చేశారు.
TG: దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నిర్మించిన శ్రీదత్త సభా మండపాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ‘ఏ రాష్ట్రంలోనైతే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించేవాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా’ అని సీఎం అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలంగాణకు వచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
తనకు గాయం తిరగబెట్టిందంటూ కథనాలు ప్రచురించిన వార్తాసంస్థలపై టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను కోలుకుని తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేను ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడట్లేదని బీసీసీఐ గానీ నేనుగానీ చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి మీకీ వార్తలు? నా తరఫున ప్రకటన లేకుండా ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరుతున్నా’ అని విజ్ఞప్తి చేశారు.
TG: చైతూ-సామ్ విడాకులు, KTR, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ <<14254371>>కామెంట్స్<<>> రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు KTR లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి కామెంట్స్పై CM రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సురేఖను మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
నాలుగేళ్ల క్రితం లాంచ్ అయిన మహీంద్రా థార్ వాహన ప్రియుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో 1.90 లక్షల వాహనాలను విక్రయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 2 లక్షల మార్కును దాటేస్తామని ధీమా వ్యక్తం చేసింది. థార్ త్రీ-డోర్ వాహనం కాగా.. ఐదు తలుపులతో కూడిన థార్ రాక్స్ను మహీంద్రా ఈ ఏడాది తీసుకొచ్చింది. దానికీ అమ్మకాలు భారీగానే ఉండటం విశేషం.
తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు. ‘మంత్రి వ్యాఖ్యలు విని షాక్కు గురయ్యా. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
TG: మంత్రి సురేఖ చేసిన కామెంట్స్పై KTR స్పందించారు. తన ఇమేజ్కు భంగం కలిగించాలనే ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ 24గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సహచర MLA అనే సోయి లేకుండా ఆమె మాట్లాడారని, భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడవద్దని KTR సూచించారు.
Sorry, no posts matched your criteria.