India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో SMలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్కుమార్ గుప్తా హెచ్చరించారు. కేంద్ర నిఘా సంస్థల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్స్గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేశారు.
AP: అన్నమయ్య(D)లో విషాదం నెలకొంది. ములకలచెరువులోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. ఈశ్వరమ్మ తన పిల్లలు లావణ్య(12), నందకిశోర్(10), పక్కింటి చిన్నారి నందిత(11)తో కలిసి దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చిన్నారులు ఆడుకుంటూ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. వారిని కాపాడే క్రమంలో ఈశ్వరమ్మ భర్త మల్లేశ్(36) కూడా నీటిలో మునిగి చనిపోయారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోల్కతాతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ల విధ్వంసంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 201/4 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ (83), ప్రియాన్ష్ ఆర్య (69) కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. కెప్టెన్ అయ్యర్ (25*) ఫరవాలేదనిపించారు. KKR బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.
IPL: పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య KKR బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ప్రియాన్ష్ 35 బంతుల్లోనే 69 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత సెంచరీ చేస్తాడని అనుకున్న ప్రభ్ సిమ్రాన్ 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 రన్స్ చేసి వెనుదిరిగారు. దీంతో పంజాబ్ జట్టు భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ మరణించారు. సరదా కంటెంట్, వ్యంగ్యమైన రీల్స్తో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఈనెల 25న పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. అయితే అంతకు 2 రోజులు ముందే మిషా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతికి గల కారణాలు వెల్లడించలేదు. మిషాకు ఇన్స్టాలో 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ది మిషా అగర్వాల్ షో’ ద్వారా యూట్యూబ్లోనూ ఆమె పాపులర్.
పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సొంత దేశస్థులే పాక్ సర్కారును SMలో ట్రోల్ చేస్తున్నారు. పాక్తో యుద్ధం 9లోపే చేయాలని, 9.15తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని ఒకరు, భారత ఫైటర్ జెట్లకు దీటుగా ఓ పాక్ వ్యక్తి ఫైటర్ జెట్ బైక్ నడుపుతున్న ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. లాహోర్ను భారత్ తీసుకుంటే, అక్కడేం లేదని అరగంటలో తిరిగిస్తుందని సొంత దేశ పాలనపై విసిగిపోయి మీమ్స్లో ఎండగడుతున్నారు.
ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కణజాల మరమ్మతులో సాయం చేస్తుంది. ఇందులోని కోలిన్ మెదడుకు మేలు చేస్తుంది. పచ్చసొన కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇది తినడం వల్ల ఊబకాయ ప్రమాదం తగ్గుతుంది. గుడ్లలోని విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
భారత్లో 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 17.1కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి, 37.8కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ‘గత దశాబ్దకాలంలో ఇండియాలో చాలావరకు పేదరికం తగ్గింది. అత్యంత పేదరికం 16.2% నుంచి 2.3 శాతానికి పడిపోయింది. రూరల్లో 18.4% నుంచి 2.8%, అర్బన్లో 10.7% నుంచి 1.1%కి చేరింది’ అని పేర్కొంది. భారత్ లోయర్-మిడిల్-ఇన్కమ్ క్యాటగిరీలోకి వచ్చిందని తెలిపింది.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కాల్పుల మోత మోగుతోంది. వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 37 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదు రోజులుగా భద్రతా దళాలు ఇక్కడ అడవిని జల్లెడ పడుతున్నాయి.
TG: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రేపు వరంగల్లో జరగనున్న BRS రజతోత్సవ సభ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని BRS పార్టీ ఖండించింది. SMలో వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని, సభ యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ ప్రచారాలకు ఒడిగట్టాయని మండిపడింది. ఈ సభతో ఆ రెండు జాతీయ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని తేల్చి చెప్పింది.
Sorry, no posts matched your criteria.