News August 15, 2025

‘సుదర్శన చక్ర మిషన్’ ప్రకటించిన ప్రధాని

image

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించారు. దీని ద్వారా రానున్న పదేళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. తద్వారా ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు.

News August 15, 2025

సెలవులు రద్దు.. రేపటి వరకు జాగ్రత్త

image

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ‘3 రోజులు కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలి’ అని మంత్రి ఆదేశించారు.

News August 15, 2025

‘PM వికసిత్ భారత్’ పథకాన్ని ప్రకటించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News August 15, 2025

నేడే ట్రంప్, పుతిన్ భేటీ.. ఏం జరగనుంది?

image

US, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ల కీలక భేటీకి రంగం సిద్ధమైంది. పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పనిచేయని ప్రాంతమైన అలాస్కా(US)లో ఇవాళ వారు భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, US ఆంక్షలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. చర్చలు విఫలమైతే INDపై టారిఫ్స్ మరింత పెరగొచ్చని US <<17407178>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఏం జరగనుందన్న ఉత్కంఠ భారతీయుల్లోనూ నెలకొంది.

News August 15, 2025

నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

image

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్‌టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.

News August 15, 2025

అమల్లోకి రూ.3000 యాన్యువల్ పాస్

image

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రూ.3,000 ఫాస్టాగ్ పాస్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ తీసుకుంటే ఫాస్టాగ్‌ను పదేపదే రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఈ పాస్‌తో ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి <<17380892>>క్లిక్ <<>>చేయండి.

News August 15, 2025

తొలిరోజు వార్-2 కలెక్షన్స్ ఎంతంటే?

image

NTR, హృతిక్ కాంబోలో నిన్న రిలీజైన ‘వార్-2’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. నార్త్‌లో తొలిరోజు కలెక్షన్లు ఊహించిన స్థాయిలో లేనట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ వెర్షన్స్ కలిపి ఇండియాలో సుమారు ₹60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ Sacnilk తెలిపింది. హిందీ కంటే తెలుగులో కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంది. సెలవు, వీకెండ్‌ నేపథ్యంలో కలెక్షన్స్ స్టడీగా కొనసాగే అవకాశముంది.

News August 15, 2025

ఈనెల 17 నుంచి బిహార్‌లో రాహుల్ యాత్ర

image

బిహార్‌లో ‘ఓట్ చోరీ’ అంటూ ECపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. పారదర్శక ఓటర్ల జాబితానే లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 17న ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగియనుంది. ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ మరిన్ని ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

News August 15, 2025

ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు RTCబస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది. సా.4గం.కు గుంటూరు(D) తాడేపల్లి మం. ఉండవల్లి గుహల వద్ద CM చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మహిళలతో కలిసి సీఎం, Dy.CM పవన్ బస్సులో ప్రయాణిస్తారు. 5రకాల RTC బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సు ఎక్కగానే గుర్తింపుకార్డు చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ తీసుకోవాలి.

News August 15, 2025

BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు TGలో WGL, MDK, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ADB, AFB, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది.