News October 2, 2024

‘ఆగడు’కి ముందు అనుకున్న కథ అది కాదు: శ్రీను వైట్ల

image

మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో దూకుడు వంటి హిట్ తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అయితే తాను వాస్తవంగా ఆ సినిమాకు అనుకున్న కథ వేరే అని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆగడుకి ముందు మహేశ్‌కు వేరే స్టోరీ అనుకున్నాం. మహేశ్‌కూ నచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పల్లెటూరిలో జరిగే సింపుల్ కథను ఎంచుకుని సినిమాగా తీశాం. నేను ఇప్పటికీ బాధపడే నిర్ణయం అది’ అని తెలిపారు.

News October 2, 2024

గోవిందా వివరణపై పోలీసుల అసంతృప్తి!

image

అనుకోకుండా తుపాకీతో <<14239558>>కాల్చుకోవడంపై<<>> బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా మిస్ ఫైర్ అయిందని ఆయన చెప్పగా ఆ వివరణతో పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పలు అనుమానాలు రావడంతో ఆయన కుమార్తెను సైతం విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 2, 2024

రేపు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చని పేర్కొంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News October 2, 2024

హిట్-3లో ‘కేజీఎఫ్’ హీరోయిన్‌

image

శైలేష్ కొలను-నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హిట్-3లో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఎంపికయ్యారు. శైలేష్ ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో హిట్-3పై భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ తొలి రెండు సినిమాలకి నాని నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో ఆయన కనిపించనున్నారు.

News October 2, 2024

ట్రెండింగ్‌లో సమంత, నాగచైతన్య, కొండా సురేఖ

image

TG: నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వారి విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్, నాగార్జునే కారణమని ఆమె సంచలన <<14254371>>ఆరోపణలు<<>> చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కాంగ్రెస్-బీఆర్ఎస్‌తో పాటు చైతూ, సామ్ ఫ్యాన్స్ మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో #Samantha, #NagaChaitanya, #KondaSurekha హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

News October 2, 2024

మనం ఇరాన్ వైపా.. ఇజ్రాయెల్ వైపా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్‌పై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్‌తో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు దెబ్బతింటాయి. ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఇండియాకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

News October 2, 2024

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

image

AP: రేపటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. మొత్తం 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. కాగా ఇవాళ విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 2, 2024

సోషల్ మీడియాలో ఆర్సీబీ సరికొత్త మైలురాయి

image

సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త మైలురాయి అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. సీఎస్కే తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జట్టుగా RCB నిలిచింది. ప్రస్తుతం సీఎస్కేకు 16 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ముంబై (14.1M) కోల్‌కతా (6.4M), హైదరాబాద్ (4.4M), రాజస్థాన్ (4.4M), గుజరాత్ (4M), ఢిల్లీ (3.9M) పంజాబ్ (3.3M), లక్నో (3.2M) ఉన్నాయి.

News October 2, 2024

మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారు: చిన్మయి

image

కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు. సమంత సినిమాల్లో చిన్మయి డబ్బింగ్ చెబుతారనే విషయం తెలిసిందే.

News October 2, 2024

చైనా PC, స్మార్ట్ మీటర్లపై సెక్యూరిటీ చెక్!

image

లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల తర్వాత భారత్ మరింత జాగ్రత్తపడుతోంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న PC, LAPTOPS, స్మార్ట్ మీటర్లు, డ్రోన్ పార్ట్స్‌‌, పార్కింగ్ సెన్సార్ల భద్రతను టెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే CCTVలను తనిఖీ చేసి ఇంపోర్ట్స్ తగ్గించాలని నిర్ణయించింది. రీసెంట్‌గా ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్‌లోకి PC, LAPTOPSను తీసుకొచ్చిన కామర్స్ మినిస్ట్రీ DECలో ఆంక్షలు పెట్టొచ్చని సమాచారం.