News July 10, 2025

చెట్లు లేకున్నా.. రసాయనాలతో ‘కల్తీ’ కల్లు!

image

TG: కూకట్‌పల్లిలో <<17003853>>కల్తీ కల్లు<<>> ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో తాటి, ఈత చెట్లు తక్కువే ఉన్నా ఒక్క HYDలోనే 100కు పైగా కల్లు కాంపౌండ్లు ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా కోసం ప్రమాదకర రసాయనాలతో కల్లు కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని సమాచారం. ఈ కల్లు నాడీ వ్యవస్థపై, కీలక అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

News July 10, 2025

PTM 2.0 కార్యక్రమాలు ఇవే

image

AP: మెగా <<17013073>>పేరెంట్స్-టీచర్స్ మీట్<<>> 2.0లో నిర్వహించే కార్యక్రమాలు ఇవే..
*విద్యార్థులు, పేరెంట్స్ ఫొటో సెషన్
*ప్రతి విద్యార్థి, పేరెంట్స్‌తో క్లాస్ టీచర్‌ సమావేశం
*తల్లికి వందనం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన
*తల్లులకు పుష్పాలిచ్చి పాదాభివందనం
*తల్లి పేరిట మొక్కలు నాటుతారు
*డ్రగ్స్, సైబర్ అవెర్‌నెస్ కార్యక్రమాలపై చర్చ
*అందరూ కలిసి సహపంక్తి భోజనం
*మ.ఒంటి గంట తర్వాత యథావిధిగా తరగతులు

News July 10, 2025

యూరియా అధికంగా వాడితే?

image

యూరియా కొరత నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తామంటూనే వాడకం తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

News July 10, 2025

ఇవాళే ‘గురు పౌర్ణమి’.. ఎవరిని పూజించాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. గురువును పూజిస్తే తనని పూజించినట్లేనని స్వయంగా వ్యాస మహర్షే చెప్పారట. అందుకే గురు పౌర్ణమికి దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్రస్వామి, సాయిబాబాని పూజించాలని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే ‘వ్యాం, వేదవ్యాసాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే పూజా ఫలితం దక్కుతుందట.

News July 10, 2025

4 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచంలో తొలి కంపెనీగా Nvidia రికార్డు

image

అమెరికాకు చెందిన చిప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ Nvidia అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ నిన్న 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఈ మార్కును అందుకున్న తొలి కంపెనీగా నిలిచింది. ఇది ఫ్రాన్స్, బ్రిటన్ GDP కంటే ఎక్కువ కావడం విశేషం. జూన్ 2023లో దీని మార్కెట్ విలువ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్లను తాకింది. AIకి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి.

News July 10, 2025

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నేడు క్లారిటీ!

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువవికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగ్గా 300కు పైగా అంశాలపై చర్చించారు.

News July 10, 2025

EP-3: ఇలా చేస్తే వివాహ బంధం బలపడుతుంది: చాణక్య నీతి

image

వివాహ బంధం బలపడాలంటే దంపతులు ఎలా నడుచుకోవాలో చాణుక్యుడు వివరించారు. ఇద్దరూ కోపం తగ్గించుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అన్ని విషయాలను చర్చించుకోవాలి. కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. మంచైనా/చెడైనా హేళన చేసుకోకూడదు. నేనే గొప్ప అనే అహం భావాన్ని పక్కన పెట్టి అన్ని పనుల్లో పరస్పరం సహకరించుకోవాలి.
<<-se>>#chanakyaneeti<<>>

News July 10, 2025

బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

image

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్‌లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్‌పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.

News July 10, 2025

నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

image

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.

News July 10, 2025

విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

image

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.