India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శైలేష్ కొలను-నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హిట్-3లో హీరోయిన్గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఎంపికయ్యారు. శైలేష్ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో హిట్-3పై భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ తొలి రెండు సినిమాలకి నాని నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో ఆయన కనిపించనున్నారు.
TG: నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వారి విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్, నాగార్జునే కారణమని ఆమె సంచలన <<14254371>>ఆరోపణలు<<>> చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కాంగ్రెస్-బీఆర్ఎస్తో పాటు చైతూ, సామ్ ఫ్యాన్స్ మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో #Samantha, #NagaChaitanya, #KondaSurekha హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్పై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్తో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్కు మద్దతిస్తే ఇరాన్తో పూర్తిగా సంబంధాలు దెబ్బతింటాయి. ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఇండియాకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
AP: రేపటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. మొత్తం 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. కాగా ఇవాళ విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త మైలురాయి అందుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. సీఎస్కే తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జట్టుగా RCB నిలిచింది. ప్రస్తుతం సీఎస్కేకు 16 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ముంబై (14.1M) కోల్కతా (6.4M), హైదరాబాద్ (4.4M), రాజస్థాన్ (4.4M), గుజరాత్ (4M), ఢిల్లీ (3.9M) పంజాబ్ (3.3M), లక్నో (3.2M) ఉన్నాయి.
కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు. సమంత సినిమాల్లో చిన్మయి డబ్బింగ్ చెబుతారనే విషయం తెలిసిందే.
లెబనాన్లో పేజర్ పేలుళ్ల తర్వాత భారత్ మరింత జాగ్రత్తపడుతోంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న PC, LAPTOPS, స్మార్ట్ మీటర్లు, డ్రోన్ పార్ట్స్, పార్కింగ్ సెన్సార్ల భద్రతను టెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే CCTVలను తనిఖీ చేసి ఇంపోర్ట్స్ తగ్గించాలని నిర్ణయించింది. రీసెంట్గా ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్లోకి PC, LAPTOPSను తీసుకొచ్చిన కామర్స్ మినిస్ట్రీ DECలో ఆంక్షలు పెట్టొచ్చని సమాచారం.
KTRపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని BRS స్పందించింది. ‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
TG: తామేమీ పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు. తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు. KTR తమను శిఖండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. తమ నోళ్లను పినాయిల్తో కడగాలన్న KTR నోటినే యాసిడ్తో కడగాలని ధ్వజమెత్తారు.
ప్రపంచవ్యాప్తంగా సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.
Sorry, no posts matched your criteria.