India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్, 2005 ప్రకారం, ఒక మహిళ తన వైవాహిక లేదా ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును కలిగి ఉంది. ఆమె సొంతం కాకపోయినా లేదా ఆమె పేరు రెంటల్ అగ్రిమెంట్లో లేకపోయినా ఆమె అక్కడ నివసించే హక్కు ఉంటుంది. ఆమె భర్త లేదా అత్తమామలు ఆమెను చట్టబద్ధంగా వెళ్ళగొట్టలేరు.

పవిత్ర ప్రబోధిని ఏకాదశి రోజున కదంబ వృక్షాన్ని పూజిస్తే విష్ణువు కటాక్షం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవతా వృక్షం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన ఈ చెట్టు కిందే వేణువు వాయించేవాడని పురాణాల వాక్కు. అందుకే ఈ చెట్టుకు ప్రభోధిని ఏకాదశి రోజున పూజ చేయాలని చెబుతారు. పసుపు, పువ్వులు సమర్పించి భక్తితో పూజిస్తే అదృష్టంతో పాటు కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని UN వేదికగా భారత్ ఫైరయ్యింది. అక్కడ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని IND దౌత్యవేత్త భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు. అక్కడి దారుణాలను ఆపకుండా భారత్పై నిందలు మోపేందుకు ఆ దేశ దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్ కపట వైఖరి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమాయకులు చనిపోయారని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనతో ప్రైవేటు ఆలయాల నిర్వహణ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భక్తి, గుర్తింపు తదితర కారణాలతో ఇటీవల కొందరు భారీ స్థాయిలో గుళ్లు కడుతున్నారు. భారీ, ఆకట్టుకునే నిర్మాణం, విగ్రహాలు, లైటింగ్ ఎఫెక్ట్స్పై సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు విపరీతంగా వెళ్తున్నారు. ప్రైవేటు నిర్వహణలోని ఆ ఆలయాల్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే నష్ట నివారణ చర్యలున్నాయా? లేదా? ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలి.

AP: కర్నూలు బస్సు ప్రమాదం(19 మంది మృతి) మరువకముందే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం సామాన్యులకు యమపాశంగా మారింది. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాధాకరం. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

భారత ప్లేయర్ రోహన్ బోపన్న(45) ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికారు. ‘నా రాకెట్ను అధికారికంగా వదిలేస్తున్నా. భారత్కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా’ అని తెలిపారు. ఇటీవల ప్యారిస్ మాస్టర్స్1000 ఈవెంట్లో బోపన్న తన చివరి మ్యాచ్(డబుల్స్) ఆడారు. 22ఏళ్ల కెరీర్లో 2 గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు ఓల్డెస్ట్ గ్రాండ్స్లామ్ విన్నర్గా, డబుల్స్లో ఓల్డెస్ట్ వరల్డ్ no.1గా చరిత్ర సృష్టించారు.

– JAN8: తిరుపతి- వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్లో ఆరుగురి మృతి
– JAN29: UP కుంభమేళా- మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది మృతి
– FEB 15: ఢిల్లీ రైల్వే స్టేషన్- రైల్వే అనౌన్స్మెంట్ గందరగోళంతో ప్లాట్ఫాం 14, 15పై 18 మంది మృతి
– JUNE4: బెంగళూరు- RCB విక్టరీ పరేడ్లో 11 మంది మృతి
– SEP27: కరూర్లో TVK చీఫ్ విజయ్ ర్యాలీలో 41 మంది మృతి
– NOV1: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 10 మంది మృతి
Sorry, no posts matched your criteria.