India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: KTRపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వాళ్లు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే, పొలిటికల్గా ఆర్గ్యుమెంట్లు లేవని అర్థం-మార్గరెట్ థాచెర్’ అనే కోట్ను ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు కేటీఆర్ను సురేఖ తిట్టడం తప్పుకాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. KTR వెంటనే సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సెక్యూరిటీ ఫోర్సెస్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు మావోయిస్టులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గ్రెనేడ్లు, IED, గన్స్తో దాడి చేసే ముందు CRPF క్యాంపుల సమీపంలో అగరబత్తీలు, దీపావళి టపాసులు పేల్చుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వాటి సౌండ్, పొగకు క్యాంప్ నుంచి పోలీసులు బయటకు రాగానే నక్సలైట్లు అటాక్ చేస్తున్నారని పేర్కొన్నాయి. SEP 25న TG కొత్తగూడెం అడవుల్లో ఈ వ్యూహాన్ని గుర్తించామని వెల్లడించాయి.
చై-సామ్ విడాకుల్లో తన ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి <<14254371>>సురేఖ<<>> ఆరోపణలను నాగార్జున ఖండించారు. ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని కోరారు. ‘సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత గల పదవిలోని మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ట్వీట్ చేశారు.
హరియాణాలోని చార్ఖీ దాద్రీ నియోజకవర్గంలోని సమస్పూర్ ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరఫరా అయ్యే తాగునీరు కనీసం పశువులు కూడా తాగలేనంత మురికిగా ఉంటోందని, చాలాకాలంగా నీటిని కొని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓట్లు అడిగేందుకు వచ్చే ఎవరైనా సరే తమ వద్ద నీటిని తాగాలంటూ సవాలు చేస్తున్నారు.
ఒలింపిక్స్లో అనర్హత అనంతరం PM మోదీ నుంచి తనకొచ్చిన ఫోన్ కాల్ను తిరస్కరించానని కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ‘PM నుంచి ఫోన్ వచ్చిందని అధికారులు చెప్పారు. సరే మాట్లాడుదాం అనుకున్నా. కానీ నా వద్ద ఎవ్వరూ ఉండకూడదని, మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేస్తామని చెప్పారు. నా భావోద్వేగాలు రాజకీయం కాకూడదని మాట్లాడేందుకు నిరాకరించాను’ అని వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి(UN) చీఫ్ ఆంటోనియో గుటెరస్పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. తమపై ఇరాన్ చేసిన దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలోకి ప్రవేశం ఉండదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. గుటెరస్ ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకోగలదని వ్యాఖ్యానించారు.
బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజులే ఆడినా టీమ్ ఇండియా ఫలితం రాబట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే ఆ విజయానికి కారణమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘ఈ జట్టుపై రోహిత్ తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం చూడకుండా దూకుడుగా ఆడి మిగిలిన ఆటగాళ్లకు శర్మ ఆదర్శంగా నిలిచారు. రోహిత్ టీమ్నుంచి వెళ్లిపోయాక కూడా ఆయన ప్రభావం ఈ జట్టుపై కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు.
TG: మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతాలైన అంబర్పేట, ముసారాంబాగ్, అంబేడ్కర్ నగర్లో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలను కేంద్రమంత్రి పరామర్శించారు.
AP: ఈ నెల 10న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకీ సంబంధించిన బిల్లును ఆమోదిస్తారని సమాచారం. చెత్త పన్ను రద్దుకు ఆమోదం, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
TG: రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సంగారెడ్డి, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.