India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మీ ప్రతినిధిని మాత్రమే. కష్టపడి పనిచేసి, నష్టపోయినవారికి అండగా ఉంటాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా YCPని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పార్టీ పిలుపునిస్తే పైస్థాయి నుంచి కిందివరకు అంతా కదలిరావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి’ అని సూచించారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్-2 మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2,000 కి.మీ దూరాన ఉన్న టార్గెట్ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కి.మీ దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపొదిలో ఉంది.
డబ్బు తీసుకొని ఈవెంట్కు గైర్హాజరయ్యారంటూ తనపై వస్తున్న <<14249459>>ఆరోపణలపై<<>> బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ స్పందించారు. జైపూర్లో తాను ఏ ఈవెంట్ మిస్ కాలేదని, అసలు తాను డబ్బే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ త్రిప్తి టీమ్ ఈమేరకు ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ మూవీ ప్రమోషన్స్ కోసం అన్ని ఈవెంట్లకు హాజరవుతున్నట్లు పేర్కొంది.
TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.
వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ యోసి కుపర్వాసర్ అన్నారు. ఈ టైమ్లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.
ఝార్ఖండ్లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఈ రెండూ కలిసి మరో దేశంపై యుద్ధం కూడా చేశాయి. ఇరాక్పై దాదాపు దశాబ్దంపాటు కలిసి పోరాటం చేశాయి. 1958 నుంచి 1990 వరకు ఈ రెండు దేశాలు కవలలుగా కొనసాగాయి. అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్కు రహస్యంగా యుద్ధ విమానాల టైర్లను ఇజ్రాయెల్ సరఫరా చేసింది. కానీ 1990 తర్వాత ఇరాక్ ముప్పు తొలగటం, అరబ్ సోషలిజం రావడం, హెజ్బొల్లా, హమాస్తో గొడవల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి.
ఝార్ఖండ్లోని హజరీభాగ్లో రూ.83,300కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాగా గత 17 రోజుల్లో ప్రధాని మోదీ ఝార్ఖండ్ను సందర్శించడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 15న జంషెడ్పూర్లో ఆయన పర్యటించారు. అప్పుడు కూడా రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. PM ఆవాస్ యోజన కింద వేలాది మంది పేదలు పక్కా ఇళ్లు పొందగలిగారని ప్రధాని అన్నారు.
టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన కుమారుడు అగస్త్యతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తండ్రీ కుమారుల అనుబంధాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా హార్దిక్, నటాషా విడాకుల అనంతరం కృనాల్ పాండ్య భార్య పాంఖురి శర్మ వద్దే అగస్త్య ఉంటున్నారు. తన కుమారుడు కవిర్తోపాటు అగస్త్య బాధ్యతలు కూడా ఆమే చూసుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో $5.5 మిలియన్ మార్క్ను క్రాస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇటు ఆస్ట్రేలియాలోనూ $850K మార్క్ను క్రాస్ చేసినట్లు యువసుధా ఆర్ట్స్ ప్రకటించింది. ఈరోజు హాలీడే కావడంతో భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.