News October 2, 2024

కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి

image

AP: కాల్ మనీ దందాపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో ప్రజల్ని వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లే టార్గెట్‌గా సాగించే వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News October 2, 2024

ఆ దేశంలో 635 రోజులు ప్రసూతి సెలవులు

image

మహిళా ఉద్యోగులు గర్భందాల్చినపుడు 6 నెలల వరకు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ‘మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961’ ప్రకారం దేశంలో గుర్తింపు పొందిన ప్రతి సంస్థ దీనిని అమలు చేయాల్సిందే. అయితే, దేశాల వారీగా ఈ సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. అత్యధికంగా యూరప్‌లోని సాన్ మారినోలో 635 రోజుల ప్రసూతి సెలవులుంటాయి. ఆ తర్వాత బల్గేరియా (410), అల్బేనియా(365), బోస్నియా (365), చైనా (158), UK (42) ఉన్నాయి.

News October 2, 2024

రూ.2వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం

image

ఢిల్లీలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్‌ను పోలీసులు ఛేదించారు. 560 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2,000కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. నార్కో-టెర్రర్ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది.

News October 2, 2024

ఈ నెల 10న సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 10న సెలవు ఉండనుంది.

News October 2, 2024

MUDA SCAM: బాపూజీ ధైర్యమిస్తున్నాడన్న సిద్దరామయ్య

image

ముడా స్కామ్, ED నోటీసులు, లోకాయుక్త కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బాపూ జీవితం, ఆయన ఆలోచనలే తనకు ధైర్యం ఇస్తున్నాయని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మతతత్వం, నియంతృత్వం, హింసతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ, సత్య స్వరూపం, శాంతి, అహింసే మన చేతిపట్టి నడిపిస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఆయనపై లోకాయుక్త FIR, ఈడీ ECIR రిజిస్టర్ చేయడం తెలిసిందే.

News October 2, 2024

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం: సురేఖ

image

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.

News October 2, 2024

ICC నం.1 టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. 870 పాయింట్స్‌తో బుమ్రా నం.1 టెస్టు బౌలర్‌గా నిలిచారు. ఇప్పటివరకు నం.1గా ఉన్న అశ్విన్ రెండో స్థానానికి పడిపోయారు. అశ్విన్ కూడా బంగ్లాతో టెస్టు సిరీస్‌లో 11 వికెట్లు తీయడం గమనార్హం.

News October 2, 2024

విజయ్ లాస్ట్ మూవీ.. ‘భగవంత్ కేసరి’ రీమేక్?

image

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్ తన చివరి చిత్రం ‘దళపతి 69’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రమైతే సేఫ్ సైడ్ అని విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనేమీ రాలేదు.

News October 2, 2024

Airtel నెట్‌వర్క్‌లో AI.. ఎందుకంటే?

image

సైబర్ క్రైమ్స్ అన్నీ ఒక ఫోన్ కాల్ లేదా SMSతో మొదలవుతాయని Airtel CEO గోపాల్ విఠల్ అన్నారు. డబ్బులు నష్టపోకుండా ఏం చేయాలో కస్టమర్లకు సూచిస్తూ Emails పంపారు. తమ నెట్‌వర్క్‌లో AIని వాడేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇది రియల్ టైమ్‌లో కాల్స్, మెసేజుల్ని అనలైజ్ చేసి యూజర్లను అలర్ట్ చేస్తుందని తెలిపారు. వేర్వేరు ఇండికేటర్ల సాయంతో రోజుకు 250 కోట్ల కాల్స్, 150 కోట్ల మెసేజుల్ని ప్రాసెస్ చేస్తుందన్నారు.

News October 2, 2024

మంత్రి సురేఖపై KTR కామెంట్స్

image

TG: మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగ్‌తో తమకు సంబంధం లేదని KTR స్పష్టం చేశారు. ‘సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని ఆమె అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? మా ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేకే దాడులకు పాల్పడుతోంది. రేపు LBనగర్‌లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’ అని మీడియాతో చిట్‌చాట్‌లో సవాల్ విసిరారు. మూసీపై తాను 2-3 రోజుల్లో ప్రెజెంటేషన్ ఇస్తానన్నారు.