News October 2, 2024

ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

image

AP: వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయి. దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది.

News October 2, 2024

టీమ్ ఇండియాకు BAD NEWS!

image

ఆస్ట్రేలియాతో కీలకమైన 5 టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ షమీ ఆ సిరీస్‌కు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని, అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అతడు పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాల సమయం పడుతుందని తెలిపింది. కాగా NOV 22 నుంచి AUSతో సిరీస్ ప్రారంభం కానుంది.

News October 2, 2024

హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది: బొలిశెట్టి

image

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్‌కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.

News October 2, 2024

కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి

image

మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది.

News October 2, 2024

రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

image

TG: అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్‌లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 7వ తేదీ మిగతా జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం కోరారు.

News October 2, 2024

సెప్టెంబర్: ఏపీ, TG జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?

image

జీఎస్టీ కింద సెప్టెంబర్ నెలకు గాను ఏపీకి రూ.3506 కోట్లు, తెలంగాణకు రూ.5,267 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే TG వసూళ్లు 1శాతం పెరగ్గా, ఏపీ వసూళ్లు 4% తగ్గినట్లు పేర్కొంది. ఇటు SGST, IGSTలో రాష్ట్ర వాటా కింద SEP నెల వరకు తెలంగాణకు రూ.21,504 కోట్లు, ఏపీకి రూ.16,393 కోట్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇందులో రెండు రాష్ట్రాలకు 7శాతం ఆదాయం పెరిగింది.

News October 2, 2024

శుభవార్త చెప్పిన BSNL

image

TG: వైఫై రోమింగ్ HYDలో సక్సెస్ అయినట్లు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ప్రకటించింది. ల్యాండ్ లైన్‌కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తుండగా, ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో కార్యాలయంలో లేదా మరెక్కడున్నా వైఫై వాడుకోవచ్చు. FTTH టవర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఈ సేవలు అందుతాయి. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు BSNL వెల్లడించింది.

News October 2, 2024

స్త్రీ శక్తిని నమ్మిన బాపూజీ

image

మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. సహాయ నిరాకరణ, మద్యపాన నిషేధ బాధ్యతలను మహిళలకే అప్పగించారు. లింగభేదాన్ని బాపూ తీవ్రంగా వ్యతిరేకించేవారు. మహిళలను బలహీనవర్గంగా పరిగణించడమంటే వాళ్లను అవమానించినట్లేనని చెప్పేవారు. సీత, ద్రౌపది, దమయంతి లాంటి పురాణ స్త్రీల గురించి ఎక్కువగా ప్రస్తావించేవారు.

News October 2, 2024

రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా!

image

ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లతా రజినీకాంత్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ‘శస్త్రచికిత్స జరిగిందని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని పేర్కొన్నారు.

News October 2, 2024

పెన్షన్లు తీసుకునేవారికి గమనిక

image

AP: ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.