India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.
AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
AP: హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్ మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9,718.84 ఎకరాల్లో ఈ కారిడార్ ఉండనుండగా, 5,107 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం వాడుతారు. 1,212 ఎకరాలు వినోద సేవలు, 898 ఎకరాలు రోడ్ల కోసం, 510 ఎకరాలు గ్రీన్ జోన్, 474 రవాణా కోసం, 456 ఎకరాలు ప్రజా వినియోగాల కోసం, 336 ఎకరాలు నివాస ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు.
నడుము చుట్టు కొవ్వు పెరుకుపోయే వారిలో చర్మ వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం ఉందని యూకే పరిశోధకులు కనుగొన్నారు. 25 వేర్వేరు శరీర అవయవాలపై చేసిన పరిశీలనల్లో ఈ చర్మ వ్యాధికి బెల్లీ ఫ్యాట్ ఓ కారణమని గుర్తించారు. మహిళల్లో ఈ ముప్పు ఎక్కువని తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఊబకాయం స్థాయిని అంచనా వేయగలుగుతున్నా సోరియాసిస్ ముప్పును అంచనా వేయలేమని చెబుతున్నారు. సోరియాసిస్కు జన్యు మూలాలూ ఓ కారణం కావొచ్చు.
TG: మహిళా సంఘాలకు ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు 2029 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 419 మంది ప్రమాద బీమా కోసం అప్లై చేయగా 204 కేసులు సెటిల్ చేశారు. కాగా స్వయం సహాయక సంఘాల్లో 47 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో TDP మద్దతు కోసం కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్ను కలిశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ BRS గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలను BRS వర్గాలు ఖండిస్తున్నాయి. 2023లో TDP మద్దతు లేకుండానే HYDలో దాదాపు అన్ని సీట్లను గెలిచామని, తమకు ఆ అవసరం లేదని పేర్కొంటున్నాయి.
TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.
AP: CM చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్రస్ట్గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా ప్రస్తుతం 193.4 TMCల నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 312.05 TMCలు కాగా.. 164.1 టీఎంసీలున్నాయి. సాగర్కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.