News October 2, 2024

పెన్షన్లు తీసుకునేవారికి గమనిక

image

AP: ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

News October 2, 2024

స్వాతంత్ర్యం తర్వాత గాంధీ నిరాహార దీక్ష.. ఎందుకంటే?

image

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎన్నో దీక్షలు చేపట్టారు. అయితే, స్వాతంత్ర్యం అనంతరం కూడా రెండు డిమాండ్లతో 1948 జనవరి 13న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. పాకిస్థాన్‌కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వాలని, ఢిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలని దీక్షలో కూర్చున్నారు. మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఆయన ఇలా చేశారని చెబుతుంటారు. విభజన సమయంలో పాక్‌కు భారత్ రూ.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.

News October 2, 2024

600 పోస్టుల భర్తీకి అనుమతి

image

TG: కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ESI ఆస్పత్రుల్లో 600 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. MHSRB ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124, స్టాఫ్ నర్సులు-272, ఫార్మాసిస్ట్-99, ల్యాబ్ టెక్నీషియన్-34, ANM-54, రేడియోగ్రాఫర్ 5 సహా మరికొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు.

News October 2, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TGలోని HYD, KMM, NLG, SRPT, MBNR, ములుగు, భద్రాద్రి, NRPT, నాగర్ కర్నూల్, RR, వికారాబాద్, MHBD, SRD, WNP, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు APలో మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA పేర్కొంది.

News October 2, 2024

ఆలస్యంగా దసరా సెలవులు

image

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి హాలిడేస్ ఇచ్చారు. స్కూళ్లకు మాత్రం 3 నుంచి 14 వరకు సెలవులు ఇవ్వడంపై ఇంటర్ పలు లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు రేపటి నుంచి హాలిడేస్ రానున్నాయి. గాంధీ జయంతి కావడంతో నేడు కూడా సెలవే.

News October 2, 2024

సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

AP: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవులు ఇచ్చినా, ప్రైవేట్ కాలేజీలకు 3, 4, 5 తేదీల్లో క్లాసులు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య తేడా ఎందుకుని, ఇవాళ్టి నుంచే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

News October 2, 2024

టెన్త్ హిందీ పుస్తకంలో 4 పాఠాలు తొలగింపు

image

AP: పదో తరగతి హిందీ పుస్తకంలో నాలుగు పాఠాలను తొలగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NCERT పాఠ్యాంశాలు బోధించేందుకు, చదివేందుకు క్లిష్టతరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన వాటిలో పద్యభాగంలో 7వ పాఠం ఆత్మత్రాణ్, గద్యభాగంలో 11వ పాఠం తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర్, 12వ పాఠం అబ్ కహ దౌసరోంకే దుఃఖ్ సే దుఃఖీ హోనేవాలే, ఉపవాచకంలో 3వ పాఠం టోపీ శుక్ల ఉన్నాయి.

News October 2, 2024

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు: CM చంద్రబాబు

image

AP: అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News October 2, 2024

మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూ సేకరణ చేపట్టాలి: మంత్రి

image

TG: స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల SHGలను 75 లక్షలకు పెంచాలని సూచించారు.

News October 2, 2024

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!

image

గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.