India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ED ఆఫీస్ దగ్గర నిన్న కాంట్రాక్ట్ కార్మికులు చేసిన <<14241454>>ధర్నాకి<<>> యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యాజమాన్యం లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.
లంకణం దివ్యౌషధం అన్నారు పెద్దలు. అయితే అది అందరికీ వర్తించదంటున్నారు వైద్యులు. థైరాయిడ్ సమస్యలున్నవారు, నెలసరి సక్రమంగా రానివారు, సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండేవారు, మధుమేహం ఉన్నవారు ఉపవాసాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఉన్న సమస్య పరిష్కారం కోసం ఉపవాసం చేస్తే వీరు లేని సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు X ద్వారా తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. SJ సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.
తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.
టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.
బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఆయేషా బాను పుట్టుకతోనే అంధురాలు. అయినప్పటికీ తన ఉన్నతమైన స్పర్శ భావాన్ని ప్రాణాలు కాపాడే సాధనంగా మలుచుకున్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరక్క ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. సైట్కేర్ హాస్పిటల్స్లో మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్గా ఉద్యోగం పొంది ఎంతో మంది మహిళల ప్రాణాలు కాపాడారు. ‘మ్యాజిక్ ఫింగర్స్’ అనే స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఆమె రొమ్ము క్యాన్సర్ గడ్డలను గుర్తిస్తారు.
ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ క్షిపణి దాడి విఫలమైందని తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని పొలిటికల్ సెక్యూరిటీ మీటింగ్లో వ్యాఖ్యానించారు. ‘మనల్ని మనం రక్షించుకోవాలి. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి’ అనే ఇజ్రాయెల్ సంకల్పాన్ని ఇరాన్ ప్రభుత్వం అర్థం చేసుకోలేదని అన్నారు.
62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. అదేదో పిచ్చి బొమ్మ అనుకుని పక్కన పెట్టేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ యజమాని కుమార్తె దాన్ని పికాసో కళాఖండంగా గుర్తించారు. అనంతరం దాని విలువ రూ.46 కోట్లని తెలిసి షాకయ్యారు. ప్రస్తుతం దాన్ని ఓ లాకర్లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్తో మాట్లాడుతున్నామని వారు తెలిపారు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (టీ20, ODI) కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నారు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగిందని పేర్కొన్నారు. 2019లో టీ20, 2020లో ODI, టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న బాబర్ 2023 ODI WC తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. మళ్లీ 2024 టీ20 WCకి ముందు కెప్టెన్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.