News July 10, 2024

8 ఏళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం!

image

AP: నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పగిడ్యాల మం. ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద ఆడుకుంటున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు బాలికను కాలువలోకి తోసేశామని ఒప్పుకొన్నారు. దీంతో బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News July 10, 2024

దేశ చరిత్రలో SIలుగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

image

దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్(పుట్టుకలో ఆడ) కాగా ఒకరు ట్రాన్స్‌ఉమెన్(పుట్టుకలో మగ) ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు.

News July 10, 2024

లోన్ యాప్స్ జోలికి వెళ్లకండి: పోలీసులు

image

TG: లోన్ యాప్స్ వేధింపులతో ఓ వ్యక్తి కిడ్నీ అమ్మేందుకు యత్నించిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వాటి జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ‘లోన్ యాప్స్ ద్వారా అప్పు చేసి అవసరాలు తీర్చుకోవటం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేస్తుంది. కానీ ఆ తర్వాత మన పాలిట శాపంగా పరిణమిస్తుంది. లోన్ యాప్ అప్పులు మన జీవితాల్ని అంధకారంలోకి నెడతాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని Xలో పోస్ట్ చేశారు.

News July 10, 2024

వారికి రుణమాఫీ లేనట్లే!

image

TG: మంత్రులు, MPలు, ఎమ్మెల్యేలు, MLCలకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10వేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, TGIIC భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా రూ.10వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ.10వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

News July 10, 2024

సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

image

AP: మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన BPCL ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

News July 10, 2024

ఇడుపులపాయ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం

image

AP: వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే నాయకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. IIIT విద్యార్థుల పేరెంట్స్‌ను లోకేశ్ కలిశారు.

News July 10, 2024

కోచ్‌గా గంభీర్.. విరాట్ కోహ్లీ పరిస్థితేంటి?

image

గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రావడాన్ని కొందరు విరాట్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటి నుంచో వీరి మధ్య వాగ్వాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. 2013, 2016, 2023 ఐపీఎల్ సమయాల్లో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మైదానంలోనే గొడవకు దిగారు. అయితే ఈ ఏడాది IPLలో గౌతీ, కోహ్లీ హగ్ చేసుకోవడంతో విభేదాలకు తెరపడినట్లు వార్తలు వచ్చాయి. మరి గంభీర్ నేతృత్వంలో కోహ్లీ భవిష్యత్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

News July 10, 2024

గంభీర్ ముందు పెద్ద సవాళ్లు!

image

*ఈ ఏడాది ఆస్ట్రేలియాతో 5 టెస్టులు
*2025లో ఛాంపియన్స్ ట్రోఫీ
*2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్
*2026లో టీ20 ప్రపంచకప్
*2026లో NZతో 2 టెస్టులు
*2027లో WTC ఫైనల్
*2027లో వన్డే ప్రపంచకప్
>>గౌతమ్ గంభీర్ మూడేళ్లు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు.

News July 10, 2024

బేర్ దెబ్బ.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

image

నిన్నటి సెషన్‌లో నూతన గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 622 పాయింట్ల నష్టంతో 79,718 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 24,239 (-194) వద్ద కొనసాగుతోంది. పవర్, రియల్టీ, టెలికాం రంగాల్లో కొనుగోళ్లు నమోదైనా.. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాలు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. M&M షేర్లు 6%కుపైగా నష్టాలను నమోదు చేశాయి.

News July 10, 2024

లావణ్యపై మాల్వి ఫిర్యాదు.. కేసు నమోదు

image

నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా HYDలోని ఫిల్మ్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై <<13570128>>లావణ్య<<>> తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన సోదరుడికి వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. మరోవైపు రాజ్ తరుణ్, మాల్విపై కొన్ని ఆధారాలతో నార్సింగి PSలో లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు.