India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సేనాపతి గెటప్తో కమల్ హాసన్ను చూడగానే ఒళ్లు జలదరించిందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు తర్వాత చాలా సినిమాలు తీశాను. కానీ లంచం గురించి వార్తలు చూసినప్పుడల్లా ఆ సినిమాయే గుర్తొచ్చేది. భారతీయుడు-2 స్టార్ట్ అయ్యాక సేనాపతి గెటప్లో ఆయన్ను చూస్తే గూస్బంప్స్ వచ్చాయి. ఆడియన్స్ కూడా అదే అనుభూతిని పొందుతారు. ఆయనలాంటి నటుడు దొరకడం మా అదృష్టం’ అని పేర్కొన్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్హాఫ్కు కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని పేర్కొంది. ‘డౌగ్కు ఇప్పటికే 3సార్లు వాక్సినేషన్, 3సార్లు బూస్టర్ డోసు పూర్తయ్యాయి. ఇంటిదగ్గర నుంచే ఐసొలేషన్లో ఉంటూ ఆయన పనిచేసుకుంటున్నారు. ఇక కమలా హారిస్కు నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్గా తేలింది’ అని వెల్లడించింది.
ప్రధాని మోదీ నేడు రష్యాకు రెండు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం నేడు మాస్కోకు చేరుకుని రేపటి వరకు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. భారత పీఎం ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో ఆయన ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని తమపై అభిమానంగా మార్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు చేరుకునేవరకు యుద్ధం జరిగేలా ‘గాజా’ కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా చేసిన సీజ్ ఫైర్ ప్రతిపాదనకు హమాస్ కొన్ని రోజుల క్రితం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అంగీకరించడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలని, హమాస్ 120మంది బందీలను విడుదల చేయాలనేది తాజా ఒప్పందంలో ప్రతిపాదన.
ప్రజలందరూ వారంలో 5 రోజుల పాటు శాకాహార భోజనం తీసుకోవాలని యాంకర్ రష్మి ట్విటర్లో్ కోరారు. ‘గతంలో వారంలో 5 రోజులు శాకాహారమే తినేవాళ్లం. ఆదివారమో లేక ప్రత్యేక సమయాల్లో మాత్రమే నాన్ వెజ్ వండుకునేవాళ్లం. అప్పుడు ఆరోగ్యాలు బాగుండేవి. కానీ నేడు చిన్నవయసులోనే మరణాలు ఎక్కువయ్యాయి’ అని పేర్కొన్నారు. నాన్ వెజ్ తినకపోతే శరీరానికి సరిపడా ప్రొటీన్ అందదన్న ఓ నెటిజన్ కామెంట్కు రిప్లైగా ఆమె ఈ పోస్ట్ పెట్టారు.
ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బుక్ మై షో’ వెబ్సైట్లో ఈ ఏడాది కోటి టిక్కెట్లు అమ్ముడైన తొలిసినిమాగా నిలిచింది. లాంగ్ రన్లో ‘కల్కి 2898ఏడీ’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్లో బీజేపీని ఓడించి తీరుతామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కాంగ్రెస్ పగటికలల్ని కంటోందని ఎద్దేవా చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఓటర్లు వరసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదు. వాస్తవాన్ని గుర్తించండి. ఆ తర్వాత మాట్లాడండి’ అని హితవు పలికారు.
జింబాబ్వేపై మ్యాచ్లో టీం ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ శతకబాదిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. అవి.. వరసగా 3 సిక్సులతో సెంచరీ కంప్లీట్ చేసుకున్న తొలి భారత ఆటగాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన సెంచరీ(46 బంతులు). రెండో అంతర్జాతీయటీ20లోనే సెంచరీ బాది ఎవిన్ లూయిస్తో సమం. అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లపై అత్యధిక పరుగులు(65).
శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరేపై మహారాష్ట్ర CM ఏక్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపే ఉన్నా ఇంకా శివసేన తమదేనంటూ ఉద్ధవ్ ఎందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో మేం 2వ స్థానంలో ఉంటే ఉద్ధవ్ పార్టీ 6వ స్థానానికి పరిమితమైంది. ఎంపీ ఎన్నికల్లోనూ మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బాలాసాహెబ్ ఆశయాలను వారు పక్కన పెట్టడం వల్లే ప్రజలు మావైపు నిలుస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.