News July 7, 2024

TEAM INDIA: కుర్రాళ్లకు ఆదిలోనే భంగపాటు..!

image

జింబాబ్వేతో తొలి T20లో ఓటమితో టీమ్ ఇండియా కుర్రాళ్లకు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. స్వల్ప లక్ష్యమే అయినా అనుభవలేమితో వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా T20 WC-2024కు క్వాలిఫై కాని పసికూనపై పరాజయం పాలైంది. దీంతో మేనేజ్‌మెంట్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లను ఉంచాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఆడించాల్సిందని వాపోతున్నారు.

News July 7, 2024

వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పులు!

image

AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు మొదలైనట్లు సమాచారం. పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మార్పులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నాయి.

News July 7, 2024

‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంపు?

image

‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మందిని సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. 21 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 23కు పెంచాలని ప్రతిపాదించనున్నారట. దీంతో సైన్యంలోని ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది. 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించడం వల్ల సిబ్బంది కొరతను అధిగమించవచ్చు.

News July 7, 2024

గుజరాత్‌లో BJPని ఓడిస్తాం.. రాస్కోండి: రాహుల్ గాంధీ

image

అయోధ్య తరహాలోనే గుజరాత్‌లోనూ బీజేపీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే కాంగ్రెస్ కొత్త శకాన్ని మొదలుపెడుతుంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమ కష్టాలే తెలుసుకోలేని మనిషి, రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు.

News July 7, 2024

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆరా

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CM రేవంత్‌తో భేటీలో చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం ఎలా పెరుగుతూ వచ్చింది? అనే అంశాలను తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 6 గ్యారంటీలపై ఎలా ముందుకెళ్తున్నారన్న విషయాలను బాబు ప్రస్తావించారు. APలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నందున తెలంగాణ అనుభవాలను CBN తెలుసుకున్నారు.

News July 7, 2024

ఇంకా దృఢంగానే ఉన్నా: దలైలామా

image

తానింకా దృఢంగానే ఉన్నానని, బోధనలు కొనసాగిస్తానని బౌద్ధగురువు దలైలామా అన్నారు. నిన్న ఆయన 89వ పుట్టినరోజు సందర్భంగా ఓ సందేశం విడుదల చేశారు. ‘90కి సమీపంలోకి వచ్చేశాను. కాళ్లలో చిన్న అసౌకర్యం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదు. నా పుట్టినరోజున ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు’ అని అందులో పేర్కొన్నారు. ఆయన మోకాలికి అమెరికాలో తాజాగా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

News July 7, 2024

భారత జట్టు చెత్త రికార్డు

image

జింబాబ్వే చేతిలో ఓడిన భారత యువ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఎనిమిదేళ్లలో టీమ్ ఇండియా ఆలౌట్ అయిన అత్యల్ప స్కోరు(102) ఇదే. చివరిసారిగా 2016లో 101 పరుగులకే(vsSL) అన్ని వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 2015లో 92(vsSA), 2016లో 79(vsNZ), 2008లో 74(vsAUS) స్కోరుకు భారత్ ఆలౌట్ అయ్యింది.

News July 7, 2024

నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

News July 7, 2024

‘కప్పట్రాళ్ల’ హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు

image

ఉమ్మడి APలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవితఖైదు పడిన వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. నేర నిరూపణకు పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. కర్నూలు(D) కప్పట్రాళ్లలో 2008 మే 17న వెంకటప్పనాయుడుతో పాటు 10 మందిని మద్దిలేటి నాయుడు, అనుచరులు నరికి చంపేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2024

రేపు విజయవాడలో సీఎం రేవంత్ పర్యటన

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత YS. రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్‌ను APCC చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు.