India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది. ఉ.11 గంటలకు జట్టు సభ్యులు ప్రధాని మోదీని కలవనున్నారు. ఎల్లుండి బీసీసీఐ భారత జట్టు సభ్యులతో ముంబైలో భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు సమాచారం. ముంబైలోని పలు ప్రధాన రహదారుల్లో ఈ ర్యాలీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
బార్బడోస్లో <<13540258>>చిక్కుకున్న<<>> భారత క్రికెట్ జట్టు స్వదేశానికి బయల్దేరింది. ‘Air India Boeing 777’ స్పెషల్ ఫ్లైట్లో సూర్యకుమార్ యాదవ్తో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇంటికి వచ్చేస్తున్నామంటూ ఈ ఫొటోను పంచుకున్నారు. దీంతో విశ్వవిజేతలకు ఘన స్వాగతం పలికేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
*Welcome To India Guys*
TG: సీబీఐ కోర్టులో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై రోజువారీ విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ కేసుల అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్ను విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చాలా కేసులున్న కారణంగా వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచించింది.
టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుపొందిన క్రమంలో గోల్డ్ మెడల్తో దిగిన ఫొటోను టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ మెడల్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి మెడల్ తమ దగ్గర కూడా ఉందని అక్షర్ పటేల్తో పాటు మహ్మద్ సిరాజ్ కామెంట్స్ చేశారు. వీరంతా ఒకే హోటల్లో ఉండి ఇలా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP: ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఉచిత ఇసుక విధానంపై పూర్తి వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర సాయంత్రం మీడియాకు వివరించనున్నారు.
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తప్పుకున్నారనే ప్రచారాన్ని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఖండించారు. తన సీజన్ క్యాలెండర్లో ఈ లీగ్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్కు సన్నద్ధమవడంపై ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలిపారు. పోటీలో ఉన్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే.
TG: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు తాము భయపడమని ఆయన అన్నారు. ‘పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసును ఖండిస్తున్నాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఆయన చేసిన నేరమా? అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
UPలోని హాథ్రస్లో జరిగిన విషాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్య నిర్వాహకుడు దేవప్రకాశ్తో పాటు మరికొందరిపై BNSలోని హత్యానేరం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భోలే బాబాను అరెస్ట్ చేసే అంశంపై ఆ రాష్ట్ర DGP ప్రశాంత్ కుమార్ స్పందించారు. దర్యాప్తులో ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 2 లక్షల మందికి బందోబస్తుగా 40+ మంది పోలీసులే విధుల్లో ఉన్నారట.
AP: అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఖరీఫ్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.