India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెట్(జులై) పరీక్షకు పాత సిలబస్ను <
టీమ్ఇండియా మాజీ హెడ్కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. లండన్లోని కింగ్స్ కాలేజ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స కోసం తనకు ఆర్థిక సాయం కావాలని ఆయన కోరినట్లు మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ బీసీసీఐకి తెలిపారు. T20WC గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్లు ఇచ్చినట్లే, ఆయనకూ సాయం చేయాలని కోరారు. దీనిపై బీసీసీఐ వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ సాయం అంతాఇంతా కాదు. అయితే, ఒక్కోసారి గూగుల్ తల్లి కూడా తప్పుదోవ పట్టిస్తుంది. ఒడిశాలోని కొంతమంది విద్యార్థులకు తాజాగా ఇదే తెలిసొచ్చింది. ధెన్కనాల్ జిల్లాలోని సప్తసాజ్య గుడికి వెళ్లిన వారు తిరిగొస్తూ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయి తప్పిపోయారు. 11గంటలపాటు అక్కడి అడవిలో అలమటించిపోయారు. ఎట్టకేలకు పోలీసుల రెస్క్యూ బృందం వారిని వెతికి పట్టుకోవడంతో బయటపడ్డారు.
సౌతాఫ్రికా విధ్వంసక ప్లేయర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ పలికినట్లు వదంతులు వస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరిదని ప్రచారం జరుగుతోంది. వీటిపై సోషల్ మీడియా వేదికగా మిల్లర్ స్పందించారు. ‘నేను టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగడం లేదు. దక్షిణాఫ్రికా తరఫున నా సేవలు కొనసాగిస్తా. నా నుంచి ఇంకా మంచి ప్రదర్శన రావాల్సి ఉంది’ అని ఆయన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
UPలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లి 116 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. బాబా పాదాల వద్ద ఉన్న పవిత్ర మట్టి, జలాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలినట్లు సమాచారం. మృతుల్లో అమాయక మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.
కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించింది. కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి ఆరేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడింది.
TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.
ప్రభాస్కు చాలా సిగ్గని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని హీరోయిన్ హంసానందిని అన్నారు. ‘మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్లో నేను నటించా. కానీ ఆ సమయంలో సినిమా చూడలేకపోయా. ఆ తర్వాత ఓ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభాస్ను కలిశా. అప్పుడు సినిమా చూడలేదని ఆయనకు చెప్పడంతో నాకు టికెట్ బుక్ చేసి మరీ సినిమా చూపించారు. నా పాట ఏ టైమ్కు వస్తుందో కూడా ఆయన చెప్పారు’ అంటూ ఆమె పేర్కొన్నారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో బాబర్ ఆజమ్కు పోలికేంటని పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఎద్దేవా చేశారు. ఈ తరంలో విరాట్ ఓ లెజెండ్ అని ఆయన కొనియాడారు. ‘కోహ్లీ ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తారు. తన ఆఖరి T20 మ్యాచ్లో కూడా చెలరేగారు. టీ20 కెరీర్ను ఆయన అద్భుతంగా ముగించారు. అదీ కోహ్లీ బ్రాండ్. ప్రస్తుత తరంలో విరాట్కు ఎవరూ సాటిరారు’ అని ఆయన స్పష్టం చేశారు.
TG: దోస్త్ ఫేజ్-3 రిజిస్ట్రేషన్లను నేటి నుంచి ఈనెల 4వ తేదీ సా.5 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రేపటి నుంచి ఎల్లుండి సా.5లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం మొత్తం 3 దశల్లో సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫేజ్-1, 2 ముగియగా, తాజాగా ఫేజ్-3 ప్రక్రియ ప్రారంభమైంది.
Sorry, no posts matched your criteria.