News July 2, 2024

హిండెన్‌బర్గ్‌తో మాకు సంబంధం లేదు: కోటక్ గ్రూప్

image

అదానీ గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో హిండెన్‌బర్గ్‌‌కు చెందిన ఇన్వెస్టర్లకు సహకరించిందన్న ఆరోపణలను కోటక్ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్‌తో తమ సంస్థలైన K-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KMILకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘క్లైంట్‌గా లేదా ఇన్వెస్టర్‌గా హిండెన్‌బర్గ్‌కు మా సంస్థతో సంబంధం లేదు. మా ఇన్వెస్టర్లలో ఎవరితోనైనా హిండెన్‌బర్గ్ పార్ట్‌నర్‌గా ఉందనే విషయం తెలియదు’ అని పేర్కొంది.

News July 2, 2024

షవర్మాలో ప్రమాదకర బాక్టీరియా!

image

పానీపూరిలో క్యాన్సర్ కారకాలున్నట్లు గుర్తించిన కర్ణాటక హెల్త్ డిపార్ట్‌మెంట్ మరో బాంబు పేల్చింది. షవర్మాలోనూ ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే బాక్టీరియా ఉన్నట్లు వెల్లడించింది. 10 జిల్లాల నుంచి 17 షవర్మా శాంపిల్స్ సేకరించి పరిశీలించగా ఎనిమిదింట్లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్లు తేలింది. కాగా ఆ రాష్ట్రం ఇప్పటికే ఫుడ్‌ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించింది.

News July 2, 2024

ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులపై RBI రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

image

బిల్ పేమెంట్స్‌లో సేఫ్టీ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తోనే చెల్లింపులు జరగాలని RBI గతంలో మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలి. HDFC, ICICI, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు దీనిని యాక్టివేట్ చేసుకోలేదు. ఫలితంగా ఫోన్‌పే, క్రెడ్, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ బిల్లులు ప్రాసెస్ చేయలేవు. ఫలితంగా క్రెడిట్ కార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వీలు పడదు.

News July 2, 2024

జింబాబ్వేతో తొలి 2 టీ20లకు ముగ్గురు ప్లేయర్ల మార్పు

image

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా తొలి రెండు టీ20లకు భారత <<13502519>>జట్టు<<>>తో చేరుతారని పేర్కొంది. సంజూ, దూబే, జైస్వాల్ స్థానంలో ఈ ముగ్గురు అందుబాటులో ఉంటారని తెలిపింది. టీ20WC గెలిచిన జట్టులో దూబే, జైస్వాల్, సంజూ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోచ్ లక్ష్మణ్‌తో పాటు కొందరు ఆటగాళ్లు జింబాబ్వేకు బయలుదేరారు.

News July 2, 2024

భారత్-శ్రీలంకలో 2026 T20 వరల్డ్‌కప్

image

భారత్-శ్రీలంక ఆతిథ్యంలో 2026 T20 వరల్డ్ కప్ జరుగుతుందని ICC ప్రకటించింది. 20 జట్లతో గ్రూప్, సూపర్ 8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ ఉండనుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక, 2024 టోర్నీ రన్నరప్ హోదాలో సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, US, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్, నేరుగా క్వాలిఫై అయ్యాయి. మరో 8 జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి.

News July 2, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన వైఎస్ షర్మిల

image

TG: ఏపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులను ఆమె ఆహ్వానించారు.

News July 2, 2024

నార్త్ అమెరికాలో ‘కల్కి’ ALL TIME RECORD

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘కల్కి’ నార్త్ అమెరికాలోనూ దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు. ఇండియాలోనూ రూ.600 కోట్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

News July 2, 2024

రైతు ఆత్మహత్యపై మంత్రి ఆరా

image

TG: ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ <<13549226>>సూసైడ్‌<<>> ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొలం పంచాయతీల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. గ్రామాల్లో పొలం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

News July 2, 2024

అందుకే వైసీపీ ఓడిపోయింది: సీపీఐ నారాయణ

image

రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, అది లేకపోవడం వల్లే ఎన్నికల్లో YCP ఓడిపోయిందని CPI నారాయణ అన్నారు. BJPతో ఉంటే ఉన్నామని, లేకపోతే లేమని జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారని, న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడంతో నష్టపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, ఓట్ల శాతం ఆధారంగా కాదని తెలిపారు. రాష్ట్రాన్ని డెవలప్ చేయకపోవడం వల్లే YCP 11 స్థానాలకు పరిమితమైందని వ్యాఖ్యానించారు.

News July 2, 2024

‘కుబేర’ నుంచి సాయంత్రం క్రేజీ అప్డేట్

image

శేఖర్ కమ్ముల, ధనుశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ఎగ్జైటింగ్ న్యూస్ రానున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.