News July 2, 2024

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం

image

TG: భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

News July 2, 2024

క్వార్టర్స్‌లో రొనాల్డో VS ఎంబాపె

image

యూరో ఛాంపియన్ షిప్‌-2024లో రొనాల్డో జట్టు పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ దూసుకెళ్లింది. స్లొవేనియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. గోల్ కీపర్ డిగో కోస్టా అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు క్వార్టర్స్ దూసుకెళ్లింది. మరో మ్యాచులో బెల్జియంపై ఎంబాపె టీమ్ ఫ్రాన్స్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పోర్చుగల్ తలపడనున్నాయి.

News July 2, 2024

శ్రీలంకలో విజయ్ యాక్షన్

image

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ #VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలుకానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. భారీ యాక్షన్ సీన్స్‌‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News July 2, 2024

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

image

AP: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 5 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 11-15 వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చు. 19న సీట్లు కేటాయిస్తారు. 20-22 తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు VIJలోని SRR, విశాఖలోని VS కృష్ణ, TPTలోని SV వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.

News July 2, 2024

పెన్షన్ల పంపిణీలో రికార్డు: మంత్రి పార్థసారథి

image

APలో 65.18 లక్షల మంది లబ్ధిదారుల్లో 61.76 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85% మాత్రమే పంచేవారు. ఇప్పుడు 12 గంటల్లోనే ఈ రికార్డు సాధించాం. సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ఉద్యోగులు ఎంత స్ఫూర్తిగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆయన పేర్కొన్నారు.

News July 2, 2024

శ్రీవారి దర్శనానికి 8 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

News July 2, 2024

గుడ్ న్యూస్.. రేపు స్వదేశానికి భారత జట్టు!

image

బెరిల్ హరికేన్ కారణంగా వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు రేపు స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. జట్టు ఆటగాళ్ల కోసం BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రేపు ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం హరికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్ పోర్టును మూసివేశారు.

News July 2, 2024

ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్?

image

TG: ఈ నెల 23న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

News July 2, 2024

చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి సస్పెండ్

image

AP: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్ సస్పెండయ్యారు. శాంతిపురం(మ) శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో CBN ఇల్లు కట్టేందుకు TDP నేతలు దరఖాస్తు చేశారు. సబ్ డివిజన్ చేసేందుకు హుస్సేన్ రూ.1.80 లక్షలు అడిగారు. ఇటీవల CM కుప్పం టూర్‌లో TDP నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఆరా తీసి, కలెక్టర్ విచారణ జరిపించగా నిజమని తేలింది. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

News July 2, 2024

SAD: బాధను భరించలేకపోతున్న మిల్లర్

image

T20WC ముగిసి 2 రోజులవుతున్నా ఫైనల్ ఓటమి బాధ నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ బయటికి రాలేకపోతున్నారు. తొలిసారి WC గెలిచే సువర్ణావకాశాన్ని త్రుటిలో కోల్పోయినప్పటి నుంచి తమ జట్టు పరిస్థితిని మాటల్లో వర్ణించలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సహచర ఆటగాళ్లతో ఫొటోలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే మిల్లర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.