News February 2, 2026

TODAY HEADLINES

image

* నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు
* ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM
* ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్
* దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: భట్టి
* కేసీఆర్‌ను 4.50 గంటలు విచారించిన సిట్
* T20WC: INDతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాక్
* కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు

News February 2, 2026

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.

News February 2, 2026

అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య: పోలీసులు

image

AP: అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ‘అంబటిపై 16 కేసులు ఉన్నాయి. సీఎం చంద్రబాబును అసభ్యంగా దూషించారు. పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటిని 14 రోజులపాటు రిమాండ్ ఇవ్వాలి. లేదంటే ఆయనకు ప్రాణహాని ఉంది’ అని పేర్కొన్నారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.

News February 2, 2026

ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం: KTR

image

TG: కేంద్రంతో పోరాడి నిధులు సాధించడంలో INC ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే KCRను సిట్ విచారణకు పిలిచి నాటకాలు చేశారన్నారు. ‘ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం. CM రేవంత్ గాలి మాటలు మాట్లాడుతూ గాల్లో తిరుగుతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా డ్రామా చేస్తున్నారు. విచారణ చేసేది సిట్టా, పీసీసీనా, బీజేపీనా అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

News February 2, 2026

నల్లపాడు పీఎస్‌లో నన్ను వేధించారు: అంబటి

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబును పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను నల్లపాడు పీఎస్‌లో టార్చర్ చేశారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అధికారుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ చెప్పారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు.

News February 2, 2026

ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ మహిళల జట్టు

image

WPL-2026 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 122/8 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఢిల్లీ ఎల్లుండి గుజరాత్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.

News February 2, 2026

రికార్డులు చూసుకోండి పాక్..

image

భారత్‌తో మ్యాచ్‌ను <<19024958>>బహిష్కరిస్తున్నట్లు<<>> ప్రకటించిన పాక్ జట్టుపై ఇండియన్స్ సెటైర్లు వేస్తున్నారు. WCలలో INDపై పాక్ రికార్డు చెత్తగా ఉందని గుర్తు చేస్తున్నారు. ODI WCలలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ అన్నీ ఇండియానే గెలిచింది. T20ల్లో ఆడిన 8 పోరుల్లో 6 సార్లు ఇండియాదే విజయం. పాక్ ఒక మ్యాచే గెలవగా మరొకటి డ్రా అయ్యింది. మైదానంలో గెలవడం చేతకాకే పరువు కాపాడుకోవడానికి ఈ డ్రామాలు చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

News February 1, 2026

మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

image

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.

News February 1, 2026

సిట్‌కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు: KTR

image

TG: ఇవాళ జరిగిన సిట్ విచారణకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ప్రతి ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు. ఎలాంటి తప్పు జరగలేదని తేలిపోయింది. కేసులో డొల్లతనం బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో మా అటెన్షన్‌ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారు’ అని దుయ్యబట్టారు.

News February 1, 2026

40 గంటలు.. 193 మంది మృతి

image

పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ ఘర్షణలతో అట్టుడుకుతోంది. 40 గంటలపాటు BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో 193 మంది చనిపోయారు. వీరిలో 145 మంది రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా పాక్‌ విస్తీర్ణంలో 42 శాతం ప్రాంతం ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కావాలని కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.