News November 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 1, 2025

శుభ సమయం (01-11-2025) శనివారం

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.2.41 వరకు
✒ నక్షత్రం: శతభిషం మ.2.29 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.30-9.30, సా.5.15-6.15
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36, వర్జ్యం: రా.8.50-10.24
✒ అమృత ఘడియలు: ఉ.7.25-8.57
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాల కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News November 1, 2025

TODAY HEADLINES

image

*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
*నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు: సీఎం రేవంత్
*420 హామీలతో ప్రజలను మోసం చేశారు: KTR
*గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN
*₹5,244Cr నష్టం.. తక్షణమే సాయం చేయాలని కేంద్రానికి ఏపీ నివేదిక
*AP: ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
*రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
*ప్రో కబడ్డీ లీగ్ విజేత దబాంగ్ ఢిల్లీ

News November 1, 2025

IBM సహకారంతో నేషనల్ ‘AI LAB’

image

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.

News November 1, 2025

అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

image

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.

News November 1, 2025

ఆమెకు మతం మారే ఆలోచన లేదు: జేడీ వాన్స్

image

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.

News November 1, 2025

అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ

image

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్‌లో హాలోవీన్ వీకెండ్‌లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్‌లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్‌బర్న్ పోలీసులు వెల్లడించారు.

News October 31, 2025

షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

image

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

News October 31, 2025

ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డేనా..!

image

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.