India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈక్విటీ డెలివరీ ట్రేడ్లపై ఎలాంటి బ్రోకరేజీ ఛార్జీలను విధించబోమని, ఈ సేవలను ఉచితంగానే కొనసాగించనున్నట్టు Zerodha CEO నితిన్ కామత్ తెలిపారు. Options కోసం STT 0.0625% నుంచి 0.1%కి పెరుగుతుందన్నారు. అలాగే లావాదేవీ ఛార్జీ 0.0495% నుంచి 0.035%కి తగ్గుతుందని, దీని ఫలితంగా సెల్లింగ్ ట్రేడ్ల ఖర్చు NSEలో 0.02303% లేదా రూ.కోటి ప్రీమియంపై రూ.2,303, BSEలో 0.0205% లేదా రూ. 2,050 పెరుగుతుందన్నారు.
ఎస్బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇతర బ్యాంకుల్లోనూ ఈ సమస్యలు ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?
AP: ‘లులు’ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చే స్థలం విలువ రూ.1,300 కోట్లు ఉందని, కానీ ఆ సంస్థ రూ.600 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గతంలో లులు కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పామన్నారు. ‘రూ.99కే మద్యం ఇవ్వడం కాదు. నిత్యావసరాల రేట్లు తగ్గించాలి. 2.50 లక్షల మంది వాలంటీర్లను తప్పించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది సిబ్బందిని తీసేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
గుజరాత్కు చెందిన ఓ కుటుంబం ఇప్పటివరకు 630 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అహ్మదాబాద్లోని మణేక్బాగ్ ప్రాంతానికి చెందిన పటేల్ కుటుంబంలో 27 మంది ఉన్నారు. వీరిలో కొందరు 100సార్లకుపైగా రక్తదానం చేశారు. మొత్తంగా 1,400 యూనిట్ల బ్లడ్ డొనేషన్ చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన మవలంకర్ ఫ్యామిలీ కూడా 356 లీటర్ల రక్తదానం చేసింది.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్కు తన బ్యాటును గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ తన బ్యాట్లను గిఫ్ట్గా ఇస్తుంటారు. రింకూ సింగ్, ఆకాశ్ దీప్, గుర్బాజ్ తదితరులకు బ్యాట్ ఇచ్చారు. మరోవైపు విరాట్ ఇచ్చిన బ్యాట్తోనే ఆకాశ్ దీప్ నిన్న బంగ్లాపై రెండు సిక్సర్లు బాదడం విశేషం.
APలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ‘5 నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను <
బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.
AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
AP: దీపావళికి 3ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని CM చంద్రబాబు పునరుద్ఘాటించారు. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా ఇవ్వచ్చో చేసి చూపించామన్నారు. వాలంటీర్లను ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ను తీసుకొస్తామని చెప్పారు. నూతన ఇసుక పాలసీతో ప్రజలకు దగ్గరలో ఉన్న ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లొచ్చని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.