India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు పూర్తయ్యాయి. విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది. ఇటు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 30 మంది నిందితుల మధ్యంతర బెయిల్ను ఈ నెల 22 వరకు హైకోర్టు పొడిగించింది. అదే రోజు తదుపరి విచారణ చేపట్టనుంది.
TG: మంత్రి కొండా సురేఖపై <<14234406>>ట్రోలింగ్ <<>>అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. ‘మంత్రిపై ట్రోలింగ్ చేసింది BRS కార్యకర్తలే. ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టులు పెడతారా? మహిళలను అవమానించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి. దీనిపై హరీశ్రావు క్షమాపణలు చెప్పాలి. ట్రోలింగ్కు ఆయన బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.
టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న క్రికెటర్గా ముత్తయ్య మురళీధరన్తో కలిసి అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ చెరో 11 సార్లు POTS సాధించారు. కాగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఒక సెంచరీతోపాటు 11 వికెట్లు కూడా తీశారు.
ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమ్ ఇండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ను మూడో ఓపెనర్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాతో జరగబోయే T20 సిరీస్కు గైక్వాడ్ను ఎంపిక చేయకపోవడంతో BCCIపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ టెస్టు సిరీస్ ముందు ఆయన అలసిపోకుండా ఉండేందుకే టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కివీస్తో టెస్టు సిరీస్కూ ఆయనను ఎంపిక చేస్తారని టాక్.
గత ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 84,266 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 25,796 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ Day High 25,900 అధిగమించకపోయినా, Day Low కింద 25,740 పరిధిలో మూడుసార్లు సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అయ్యింది. అటు సెన్సెక్స్లో కూడా ఇదే రకమైన ప్యాట్రన్ కనిపించింది.
బంగ్లాతో టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 90 సిక్సర్లు నమోదు చేసి ఇంగ్లండ్(89)ను అధిగమించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
AP: గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘అధికార యంత్రాంగం నిర్వీర్యం అయింది. మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు. వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 22ఏ పేరుతో భూములు దోచుకున్నారు. మీరు గెలిపించిన 21 మంది ఎంపీలే నేడు మన రాష్ట్రానికి సంజీవనిలా మారారు. వాళ్లు లేకుంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండేది కాదు’ అని కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామసభలో తెలిపారు.
AP: తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తప్పేంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లే తిరుమలనూ UT చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికల హామీల దృష్టి మరల్చేందుకే లడ్డూ వివాదం సృష్టించారు. చంద్రబాబు అసలు హిందువే కాదు.. నాస్తికుడు. పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. లడ్డూపై రాజకీయ ప్రచారం ఆపాలి’ అని ఆయన ఫైర్ అయ్యారు.
చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు తాము అండగా నిలబడటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు. ఇది ఉద్యమాల పిడికిలి అని గుర్తు పెట్టుకోవాలి. పేదల గొంతులను మీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు’ అని HYDRAA ఇళ్లను కూల్చేస్తున్న ఫొటోను KTR షేర్ చేశారు.
Sorry, no posts matched your criteria.