News October 1, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

image

గ‌త ట్రేడింగ్ సెష‌న్‌లో భారీ న‌ష్టాలు చ‌విచూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగ‌ళ‌వారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు న‌ష్ట‌పోయి 84,266 వ‌ద్ద‌, నిఫ్టీ 13 పాయింట్ల న‌ష్టంతో 25,796 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. నిఫ్టీ Day High 25,900 అధిగ‌మించ‌క‌పోయినా, Day Low కింద 25,740 ప‌రిధిలో మూడుసార్లు స‌పోర్ట్ తీసుకొని క‌న్సాలిడేట్ అయ్యింది. అటు సెన్సెక్స్‌లో కూడా ఇదే ర‌క‌మైన ప్యాట్ర‌న్ క‌నిపించింది.

News October 1, 2024

బంగ్లాతో టెస్ట్.. భారత్ రికార్డుల మోత

image

బంగ్లాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 90 సిక్సర్లు నమోదు చేసి ఇంగ్లండ్(89)ను అధిగమించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

News October 1, 2024

21 మంది ఎంపీలే సంజీవనిలా మారారు: CM

image

AP: గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘అధికార యంత్రాంగం నిర్వీర్యం అయింది. మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు. వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 22ఏ పేరుతో భూములు దోచుకున్నారు. మీరు గెలిపించిన 21 మంది ఎంపీలే నేడు మన రాష్ట్రానికి సంజీవనిలా మారారు. వాళ్లు లేకుంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండేది కాదు’ అని కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామసభలో తెలిపారు.

News October 1, 2024

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: కేఏ పాల్

image

AP: తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తప్పేంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లే తిరుమలనూ UT చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికల హామీల దృష్టి మరల్చేందుకే లడ్డూ వివాదం సృష్టించారు. చంద్రబాబు అసలు హిందువే కాదు.. నాస్తికుడు. పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. లడ్డూపై రాజకీయ ప్రచారం ఆపాలి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 1, 2024

సరిహద్దుల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు: ఆర్మీ చీఫ్

image

చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్‌లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.

News October 1, 2024

భయపడేవారు ఎవరూ లేరిక్కడ: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు తాము అండగా నిలబడటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు. ఇది ఉద్యమాల పిడికిలి అని గుర్తు పెట్టుకోవాలి. పేదల గొంతులను మీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు’ అని HYDRAA ఇళ్లను కూల్చేస్తున్న ఫొటోను KTR షేర్ చేశారు.

News October 1, 2024

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 15వ సారి పెరోల్

image

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ పెరోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తించింది. అక్టోబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్న‌ హ‌రియాణా ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌కు పెరోల్ రావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇప్ప‌టికే ఈ కేసులో ఆయ‌న గత 9 నెల‌ల్లో మూడుసార్లు, గ‌త నాలుగేళ్ల‌లో 15 సార్లు పెరోల్‌పై విడుద‌లవ్వ‌డం గ‌మ‌నార్హం. అత‌ని పెరోల్ ర‌ద్దు చేయాల‌ని ఈసీని కాంగ్రెస్ కోరింది.

News October 1, 2024

శృంగారం తర్వాత రక్తస్రావం.. గూగుల్లో రెమిడీస్ వెతికిన బాయ్‌ఫ్రెండ్

image

కామన్‌సెన్స్ లేకుండా ఆన్‌లైన్ రెమిడీస్ వెతకడం ఎంత డేంజరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుజరాత్‌లో 23Yrs నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ SEP23న హోటల్‌కెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడామెకు విపరీతంగా రక్తస్రావమైంది. ఓ వైపు ఆమె భయపడుతోంటే అతడేమో గూగుల్లో రెమిడీస్ వెతికాడు. విలువైన సమయం వృథా కావడంతో ఆమె స్పృహ తప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు.

News October 1, 2024

రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.

News October 1, 2024

ఈ వికెట్ కీపర్లకు భారీ డిమాండ్

image

త్వరలో జరిగే IPL2025 మెగావేలంపై భారీ అంచనాలున్నాయి. అయితే భారీ సిక్సర్లు బాదడంతో పాటు మెరుపులా వికెట్ కీపింగ్ చేసే వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. ఇషాన్‌కు MI 2022లోనే రూ.15.25కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. RR తరఫున ధ్రువ్, PBKS‌లో జితేశ్ అంచనాలకు మించే రాణించారు. వీరిలో మీ ఓటు ఎవరికి?