News June 22, 2024

హంగేరీలో నలుగురు పిల్లలుంటే జీవితాంతం నో ట్యాక్స్

image

ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులతో హంగేరీ యువత వివాహాలపై ఆసక్తి చూపట్లేదు. జననాలు తగ్గిపోవడంతో ఆ దేశ PM విక్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే మహిళలకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు. 41ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటే ₹22 లక్షల సబ్సిడీ రుణాలను 2019 నుంచి ఇస్తున్నారు. ఇద్దరికి జన్మనిస్తే మూడోవంతు, ఆపైన పిల్లలను కంటే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తున్నారు.

News June 22, 2024

కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు: మంత్రి గొట్టిపాటి

image

AP రైతులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశారు. ఆ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇవాళ ఇంధన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. GOVT ఆఫీసులకు సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, PM సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికీ 3 కిలోవాట్ల సోలార్ కరెంట్ అందించే ఫైళ్లపైనా సైన్ చేశారు. ఏపీ విద్యుత్ శాఖను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు.

News June 22, 2024

నిరుద్యోగుల డిమాండ్లపై సీఎంకు హరీ‌శ్‌రావు లేఖ

image

TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల వ్యవధిని పెంచాలి. గ్రూప్-2, 3లో మరిన్ని ఉద్యోగాలను కలపాలి. 25వేల పోస్టులతో మెగా DSC విడుదల చేయాలి. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి బకాయిలతో సహా చెల్లించాలి. GO46ను రద్దు చేయాలి’ అని కోరారు.

News June 22, 2024

పార్టీ ఆఫీస్ బయటే డిప్యూటీ సీఎం ప్రజాదర్బార్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసు బయటే ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడే కుర్చీలు వేసి ప్రజలతో మాట్లాడి వారి అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

News June 22, 2024

కన్నడ నటుడు దర్శన్‌కు జుడీషియల్ కస్టడీ

image

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు స్పెషల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అతనితో పాటు ఈ కేసులో ఇతర నిందితులను జులై 4 వరకు జుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులను ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

News June 22, 2024

BREAKING: తిరుమల లడ్డూ ధరలు తగ్గలేదు: TTD

image

AP: తిరుమల లడ్డూ ధర తగ్గింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. రూ.300 స్పెషల్ ఎంట్రీతో పాటు లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. కాగా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ధరలను రూ.200కు, లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

News June 22, 2024

Xలో లైవ్ స్ట్రీమ్‌.. త్వరలో కొత్త రూల్

image

X(ట్విటర్)లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కలిగిన యూజర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్‌ను ప్రారంభించేలా కొత్త నిబంధన రానుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం Xలో బేసిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు ₹215తో ప్రారంభమవుతోంది. కమర్షియల్ యాడ్స్ నుంచి ఆదాయం తగ్గడంతో సబ్‌స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆ సంస్థ ఓనర్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం.

News June 22, 2024

‘ప్రజాదర్బార్‌’కు అనూహ్య స్పందన: మంత్రి లోకేశ్

image

AP: తాను ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘కేవలం మంగళగిరి నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా నన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాను’ అని ట్వీట్ చేశారు.

News June 22, 2024

వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాలు, రిజర్వేషన్లు పెరుగుతాయి: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘నియోజకవర్గాలు మారుతాయి. SC, ST, మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు అవకాశాలు ఉంటాయి. వచ్చే సారి పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత BRS ప్రభుత్వంలాగే కాంగ్రెస్ సర్కారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అని తెలిపారు.

News June 22, 2024

NEET పేపర్ లీక్ వివాదం.. కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

image

NTA పనితీరును సమీక్షించడానికి, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ISRO మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఢిల్లీ AIMS మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, HCU VC ప్రొ. బి.జె.రావు, IIT మద్రాస్ ప్రొ. రామమూర్తి, కర్మయోగి భారత్ కో ఫౌండర్ పంకజ్, IIT ఢిల్లీ డీన్ ప్రొ. ఆదిత్య, కేంద్ర విద్యాశాఖ JS గోవింద్ సభ్యులుగా ఉన్నారు.