News April 21, 2025

పౌరసత్వం కేసు.. ఆది శ్రీనివాస్‌కు జరిమానా చెల్లించిన చెన్నమనేని

image

TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు BRS మాజీ MLA చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో శ్రీనివాస్ HCని ఆశ్రయించారు. రమేశ్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గతేడాది DECలో నిర్ధారించిన కోర్టు, శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ రమేశ్ జరిమానా కట్టారు.

News April 21, 2025

రేపటి నుంచి ‘NTR-NEEL’ మూవీ షూటింగ్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR-NEEL’ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున హీరో, డైరెక్టర్ నిల్చొని డిస్కస్ చేస్తోన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలను దాటిచేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

News April 21, 2025

న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు

image

ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం నిర్ణయం తీసుకుంది.

News April 21, 2025

రావణుడొచ్చేస్తున్నాడు!

image

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తోన్న ‘రామాయణ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ ఈ వారంలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ’ చిత్రాన్ని నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.

News April 21, 2025

BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్

image

గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి రిటైనర్‌షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్‌పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.

News April 21, 2025

IPL.. CSKకు ఇంకా అవకాశం ఉందా?

image

IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్‌‌కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్‌రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?

News April 21, 2025

‘శాలరీ’ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది!

image

భారత్‌లో దశాబ్దాలుగా మధ్య తరగతివారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘ఇండియా నూతన ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తోంది. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రానున్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. వందలాది మంది చేసే పనిని AI క్షణాల్లో చేసేస్తోంది. ఎవరికీ గ్యారంటీ లేదు’ అని వివరించారు.

News April 21, 2025

గ్రూప్-1 మెయిన్స్‌లో 2 మార్కులెలా?: BRS నేత

image

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు. ఫలితాల జాబితాను షేర్ చేస్తూ.. ఇందులో కొందరికి 2 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో 90శాతం మందికి 150+ మార్కులు రాగా ఇద్దరికి 2 మార్కులొచ్చాయి. ప్రిలిమ్స్‌లో సత్తా చాటిన వారికి మెయిన్స్‌లో ఇంత తక్కువ మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై TGPSC ఎలా స్పందిస్తో చూడాల్సి ఉంది.

News April 21, 2025

పిచ్ క్యురేటర్‌పై విమర్శలు.. కామెంటేటర్లపై CAB అసహనం

image

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే IPL మ్యాచులకు హర్షా బోగ్లే, సైమన్ డౌల్‌ను అనుమతించొద్దని BCCIకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది. పిచ్‌ తయారీలో క్యురేటర్ BCCI రూల్ బుక్‌నే ఫాలో అయ్యారని, ఆయన తప్పేం లేదని పేర్కొంది. దీంతో నేడు KKRvsGT మ్యాచులో హర్ష, డౌల్ కనిపించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. KKR బౌలర్లకు సూట్ అయ్యేలా పిచ్ లేదని, ఆ జట్టు హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవాలని వీరు కామెంట్ చేశారు.

News April 21, 2025

భారీగా పెరగనున్న బీటెక్ ఫీజులు?

image

TG: వచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫీజులు 20-50% వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ₹2లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాలేజీల నుంచి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రతిపాదనలను స్వీకరించింది. అధికారులు సమావేశమై వీటిపై చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆమోదంతో ఫీజులు ఖరారు కానున్నట్లు సమాచారం.