News October 1, 2024

రేపటి నుంచి స్కూళ్లకు సెలవు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కాగా, ఈ నెల 13 వరకు ఏపీలో సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో HYD, ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

News October 1, 2024

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి

image

AP: రాష్ట్రంలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వ్యక్తిగతంగా ఇసుక ఆన్‌లైన్ బుకింగ్‌ <<14145449>>ప్రక్రియ<<>> మొదలైన విషయం తెలిసిందే.

News October 1, 2024

పెట్రోల్, డీజిల్‌ కంపెనీలకు HUGE PROFIT

image

క్రూడాయిల్ ధరల పతనంతో HPCL, BPCL, IOL వంటి OMCలు లాభాల పంట పండిస్తున్నాయి. లీటర్ పెట్రోలుపై రూ.15, డీజిల్‌పై రూ.12 వరకు ప్రాఫిట్స్ పొందుతున్నాయని ICRA తెలిపింది. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించి కస్టమర్లపై భారం తగ్గించే స్థాయిలో ఇవి ఉన్నాయని వెల్లడించింది. OMCలకు FY24 అద్భుతంగా ఉందని, గత FYతో పోలిస్తే మొత్తం లాభం 25 రెట్లు పెరిగి రూ.86,000 కోట్లకు చేరుకుందని పెట్రోలియం మినిస్ట్రీ సైతం పేర్కొంది.

News October 1, 2024

నెయ్యి కల్తీ వాస్తవం.. ఎవరినీ వదలం: మంత్రి డీబీవీ స్వామి

image

AP: తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం వాస్తవమని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటుచేశామని, ఇందులో ఎవరి ప్రమేయమున్నా వదిలేది లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ప్రతి నెలా 1న పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు.

News October 1, 2024

దీక్ష విరమించిన బీజేపీ నేతలు

image

తెలంగాణ బీజేపీ నేతలు ‘రైతు హామీల సాధన దీక్ష’ను విరమించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటూ హైదరాబాద్‌లోని ధర్నా‌చౌక్ వద్ద దీక్ష చేపట్టిన నేతలకు బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చారు. ప్రకటించిన గ్యారంటీలను సీఎం రేవంత్ అమలు చేయలేకపోయారని విమర్శించారు.

News October 1, 2024

రేవంత్ సైకోలా వ్యవహరిస్తున్నారు: ఈటల

image

TG: హైడ్రా విషయంలో CM రేవంత్ తీరుపై BJP MP ఈటల విమర్శలు గుప్పించారు. రేవంత్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనకు చట్టాలు, జడ్జీలపై నమ్మకం లేదన్నారు. హైడ్రా విషయంలో రేవంత్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. చట్టంపై గౌరవం ఉంటే సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేసే వారినే ప్రజలు నమ్ముతారని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు నిజంగానే వారిని మోసం చేస్తున్నారన్నారు.

News October 1, 2024

డిస్కౌంట్స్‌కు ముందు ధరల పెంపు.. రంగంలోకి AUS ప్రధాని

image

భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్‌ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్‌ను మార్చేస్తున్నాయని వాచ్‌డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్‌తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.

News October 1, 2024

3న ఓటీటీలోకి ‘ది గోట్’ మూవీ

image

వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో దళపతి విజయ్ నటించిన ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఈ నెల 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 5న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.

News October 1, 2024

రాహుల్‌గాంధీ సిటిజన్‌షిప్ PIL: టైమ్ కావాలన్న కేంద్రం

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకొనేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు తెలిపింది. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంటును ఎందుకు క్యాన్సిల్ చేశారో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ హైకోర్టులో వేసిన పిల్‌కు వివరణ ఇచ్చింది.

News October 1, 2024

డిసెంబర్ 25న ‘గేమ్ ఛేంజర్’ విడుదల: దిల్ రాజు

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ‘రా మచ్చా మచ్చా’ ఈవెంట్‌లో ఆయన ప్రకటించారు. అయితే, గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండటంతో క్రిస్మస్‌కి ప్లాన్ చేశారు. కాగా, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది.