India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. ఆయనతో సహా ఇప్పటివరకు ముగ్గురు నిందితులు ఈ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రీధర్ ఏ6గా ఉన్నారు.
TG: హైదరాబాద్లో ఉంటున్న పాకిస్థానీయులపై పోలీసులు నిఘా ఉంచారు. నలుగురిని షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్గా గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచివెళ్లాలని ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేశారు. నగరంలో మొత్తం 213 మంది పాక్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అందులో 209 మందికి లాంగ్టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హరియాణాలో దారుణం జరిగింది. రోడ్డును శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై ఓ వ్యాను దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై విధులు నిర్వహిస్తుండగా వ్యాను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
AP: జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణం అని TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ‘ఈ లిక్కర్ స్కామ్లో ముందుగా బిగ్బాస్ను జైలుకు పంపాలి. అతడి దురాశ వల్లే నాసిరకం మద్యం తాగి ఎంతో మంది పేదలు మృతిచెందారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని CBI, EDతో విచారణ జరిపించాలి. ఇది రూ.3,200 కోట్ల స్కామ్ కాదు.. రూ.10వేల కోట్లకు పైనే జరిగింది’ అని ప్రెస్మీట్లో ఆరోపించారు.
CSKకి ఒకప్పుడు చెపాక్ స్టేడియం దుర్భేద్యమైన కోటలా ఉండేది. అక్కడికి వెళ్లి ఆ జట్టును కొట్టాలంటే దాదాపు అసాధ్యమేనని ఇతర జట్లు భావించేవి. కానీ ఈ సీజన్లో ఆ కోట బీటలు వారింది. ఆ స్టేడియంలో వరసగా 4 మ్యాచులు ఓడటమే కాక 17 ఏళ్లలో తొలిసారి RCB చేతిలో, 15 ఏళ్లలో తొలిసారి ఢిల్లీ చేతిలో, 12 ఏళ్లలో తొలిసారి SRH చేతిలో చెన్నై ఓడిపోయింది. ఇక చెపాక్లో అత్యంత తక్కువ స్కోరును KKRపై నమోదు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి తమ పనేనని చెప్పిన ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ఇప్పుడు మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదు. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు’ అని ఆరోపించింది.
☛ లండన్లోని మేడమ్ టుస్సాడ్స్లో మే 9న రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
☛ శర్వానంద్-సంపత్ నంది సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్
☛ కార్తీక్ దండు డైరెక్షన్లో నాగచైతన్య చేస్తున్న సినిమాకు ‘వృష కర్మ’ టైటిల్ ఖరారు?.. నేడు సా.4.05 గంటలకు మేకర్స్ నుంచి కొత్త అప్డేట్
☛ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి సినిమా షూట్ 60 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసిన మూవీ టీమ్
తన పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. పుట్టుక నుంచి పిల్లలు గుండె సమస్యతో బాధ పడుతున్నారని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు పాకిస్థానీలు భారత్ నుంచి వెళ్లాలని ఆదేశించడంతో ఆపరేషన్ కాకుండానే వెళ్లాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం ₹కోటి ఖర్చైందని, ఆపరేషన్ జరిగేలా చూసి పిల్లల ప్రాణాలు కాపాడాలని అభ్యర్థిస్తున్నాడు.
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా లండన్లోని పాక్ హైకమిషన్ వద్ద భారతీయులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సమాజం పాక్ విషయంలో స్పందించాలని, ఉగ్రవాదంపై నిలదీయాలని వారు డిమాండ్ చేశారు. ఆ ధర్నాను లండన్ పోలీసులు తాజాగా భగ్నం చేశారు. భారత సంతతి నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు.
కర్రెగుట్ట కాల్పులపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హనుమకొండలో అత్యవసరంగా భేటీ అయిన సంఘాలు.. వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరాయి. కాగా పూజారికాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. 4 హెలికాప్టర్లతో గుట్టపై కాల్పులు జరుపుతున్నాయి. ఇందులో భారీగా మావోయిస్టులు హతమైనట్లు వార్తలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.