News August 14, 2025

బిహార్ ఓటరు లిస్టుపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

image

బిహార్‌‌లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను జిల్లాల వారీగా ప్రకటించాలని ECని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. జిల్లాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ఉంచాలని, దీనిపై వార్తా పత్రికలు, రేడియో, SMలో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. AUG 19లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను AUG 22కి వాయిదా వేసింది.

News August 14, 2025

హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

News August 14, 2025

BIG ALERT: ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు

image

AP: అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని సూచించింది.

News August 14, 2025

అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. JGL, భూపాలపల్లి, KNR, MHBD, MNCL, ములుగు, NML, NZB, PDPL జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. HYD, ADB, భద్రాద్రి, HNK, MDK, SRCL, WGL, ఖమ్మం, కొమురం భీం, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

News August 14, 2025

సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు: అయ్యన్నపాత్రుడు

image

AP: సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. YCP వాళ్లు వస్తారో? లేదో? క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ‘అసెంబ్లీకి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? సభకు వచ్చి సమస్యలు అడగాల్సిన బాధ్యత లేదా? YCP ప్రభుత్వంలో ఐదేళ్లలో 78 రోజులే సభను నడిపించారు’ అని విమర్శించారు.

News August 14, 2025

వార్-2 VS కూలీ.. ఏ మూవీకి వెళ్లారు?

image

NTR, హృతిక్‌ల ‘వార్-2’, రజినీకాంత్ ‘కూలీ’ సినిమాల బాక్సాఫీస్ ఫైట్ మొదలైంది. భారీ అంచనాల మధ్య ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ రెండు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఫ్యాన్స్‌‌కు మాత్రం అదిరిపోయే ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరోల స్క్రీన్ ప్రజెన్స్‌తో కడుపునిండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఏ మూవీకి వెళ్లారు? ఎలా అనిపించింది? COMMENT

News August 14, 2025

యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

image

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.

News August 14, 2025

నటుడు దర్శన్ బెయిల్ రద్దు

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ నటుడు దర్శన్‌, పవిత్ర గౌడ సహా మరో ఐదుగురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు వారికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. తక్షణమే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా వారికి కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

News August 14, 2025

కుక్కల తరలింపుపై పిటిషన్లు.. అధికారులపై SC ఫైర్

image

ఢిల్లీలో వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ <<17396741>>పిటిషన్లు<<>> దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా అధికారులపై SC ఫైరైంది. ‘పార్లమెంట్ తీసుకొచ్చిన రూల్స్, చట్టాలు అమలు కావడం లేదు. లోకల్ అథారిటీస్ సక్రమంగా పని చేయట్లేదు. దీనిపై బాధ్యత తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. పిటిషన్లపై ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. అయితే గత తీర్పుపై స్టే విధించలేదు.

News August 14, 2025

పెన్షన్లు తీసుకునే వారికి BIG ALERT

image

AP: అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.