News October 27, 2025

వయసును తగ్గించే ఆహారాలివే..

image

ప్రస్తుతం మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లతో కొంతమందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల చికిత్సలు చేయించుకోవడం, ఏవేవో క్రీములు రాసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఆహారంలో బ్లూబెర్రీలు, టమాటాలు, పెరుగు, గ్రీన్ టీ, డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు హైడ్రేటెడ్‌గా ఉండటం, మెడిటేషన్ చేయడం మంచిదంటున్నారు.

News October 27, 2025

రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్‌ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News October 27, 2025

ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపులో మార్పులు ఎందుకంటే?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం తెలిసిందే. ఇక నుంచి శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక ₹2 లక్షలు కాకుండా ₹1.40 లక్షలే ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తుండటం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి విడత ₹లక్షతో కలిపి మిగతా ₹60 వేలను అందించనుంది.

News October 27, 2025

తుఫాను ఎఫెక్ట్.. 22 జిల్లాల్లో సెలవులు

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ(D)లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.

News October 27, 2025

విషాదాలు మిగిలిస్తున్న తుఫాన్లు

image

AP: తుఫాన్లు కోస్తాంధ్రాను అతలాకుతలం చేస్తున్నాయి. 1971-2023 మధ్య 60 తీవ్రమైన సైక్లోన్లు తీరం దాటాయి. 1971లో బారువ, 1977లో దివిసీమ, 1996లో బలుసుతిప్పతో పాటు తర్వాత సంభవించిన ఖైముక్, లైలా, జల్, నీలం, హుద్‌హుద్, తితిలీ తుఫాన్లు తీవ్ర ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. MAR నుంచి JUNE.. SEP నుంచి DEC వరకు 2 సీజన్లలో సైక్లోన్లు సంభవిస్తుంటాయి. కానీ వాతావరణ మార్పులతో OCTలోనే దూసుకొస్తున్నాయి.

News October 27, 2025

శనగపిండితో చర్మానికి మెరుపు

image

చర్మసంరక్షణకు మన పూర్వీకుల కాలం నుంచీ శనగపిండిని వాడుతున్నారు. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొడిచర్మం ఉన్నవారు హైడ్రేషన్ కోసం శనగపిండిని వాడాలంటున్నారు. దీనికోసం 4 స్పూన్ల శనగపిండి, రోజ్​వాటర్/ నిమ్మరసం, కాస్త తేనె కలపాలి. దీన్ని ఫేస్​కి, మెడకు పట్టించుకొని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

News October 27, 2025

త్వరలో హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు

image

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద జీరో ఎమిషన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని క్రమంగా పెంచుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 10,900 బస్సుల కోసం NOV 6న బిడ్లను ఓపెన్ చేయనుంది. వీటిల్లో హైదరాబాద్‌కు 2,000, సూరత్‌ & అహ్మదాబాద్‌కు 1,600, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500 కేటాయించనుంది.

News October 27, 2025

హరిద్వార్ న్యాచురల్ గ్యాస్ ప్రై. లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హరిద్వార్ న్యాచురల్ గ్యాస్ ప్రై. లిమిటెడ్‌ 5 ఆఫీసర్, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి బీకామ్, ఎంకామ్, CA, CMA, MBA, PGDBM, BE, బీటెక్/ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు రూ.55వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hngpl.in/

News October 27, 2025

ప్రాణాంతక ‘కుందేటి వెర్రి వ్యాధి’.. లక్షణాలు

image

పశువుల్లో వచ్చే ప్రాణాంతక రోగాల్లో ‘కుందేటి వెర్రి వ్యాధి’ ఒకటి. దీన్ని ట్రిపనోసోమియోసిస్ అని కూడా అంటారు. టబానస్, స్టోమాక్సీన్ అనే జోరీగిల కాటు ద్వారా రక్తంలోకి ట్రిపనోసోమా అనే పరాన్నజీవి వెళ్తుంది. 103-106డిగ్రీల జ్వరం, నీరసం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, దృష్టిలోపం, పొట్ట కింది భాగంలో వాపు, వెర్రిగా చూస్తూ పళ్లను ఎక్కువగా నూరడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాధి ముదిరితే మరణం సంభవిస్తుంది.

News October 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 48

image

1. హనుమంతుడి గురువు ఎవరు?
2. వ్యాసుని తల్లి ఎవరు?
3. కుబేరుడి వాహనం ఏది?
4. కామదహనం జరిగే పండుగ ఏది?
5. ఇంద్రుని వజ్రాయుధం చేసిన ముని ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>