India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను నియమించింది.
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లతో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. విద్యార్థులకు న్యాయం అందేలా చేసేందుకే ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కాగా నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
TG: తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా BRS ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐ కాలేజీలు ఉన్నాయని, టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. వారికి అప్రెంటీస్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని ఆయన వివరించారు.
రైల్వే భద్రతా విభాగంలో మంజూరైన పది లక్షల పోస్టులకు గాను 1.5లక్షలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. RTI దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇందులో లోకో పైలట్ 14,429, అసిస్టెంట్ డ్రైవర్ 4,337 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అలాగే రైల్వే భద్రతా ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య కాలంలో రూ.70 వేల కోట్లు, 2014-24 సంవత్సరాల్లో రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించినట్లు ఓ అధికారి చెప్పారు.
T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజీకి సంబంధించిన మ్యాచ్ అంపైర్లను ICC ప్రకటించింది. అందులో రిచర్డ్ కెటిల్బరో ఉండటంతో టీమ్ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 24న జరిగే ఆస్ట్రేలియా VS ఇండియా మ్యాచ్లో ఆన్-ఫీల్డ్ అంపైర్గా ఆయన వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఉన్న ప్రతి మ్యాచ్లో ఇండియా ఓడిపోతూ వస్తోంది. ఆయన అంపైరింగ్లో 2014 T20 WC, 2015 ODI WC, 2016 T20 WC, 2017 CT, 2019 ODI WCలోనూ ఇండియా ఓడిపోయింది.
దేశవ్యాప్తంగా ఈ నెల పెద్దగా వర్షపాతం నమోదు కాకపోవచ్చని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. జూన్ నెల దీర్ఘకాల వర్షపాతం సగటు కంటే ఈ ఏడాది తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఓ మాదిరిగా ఉన్నా ఉత్తరాది, మధ్య భారత రాష్ట్రాలకు బాగా తక్కువ నమోదవుతుందని వెల్లడించింది. జూన్ సగటు వర్షపాతం 80.6mm కాగా ఈ నెలలో 20శాతానికిపైగా తగ్గి కేవలం 64.5mm వర్షపాతం నమోదైంది.
TG: ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లపై కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం.
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడ్డారు. గాయాలతో ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రియాంక హీరోయిన్గా నటిస్తున్న‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూట్లో భాగంగా ఆమె ముఖం, మెడ, పెదవిపై గాయాలయ్యాయి. దీంతో మేకర్స్ వెంటనే షూటింగ్ నిలిపేసి ఆమెను సిడ్నీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై క్లారిటీ రాలేదు.
చంద్రబాబు సపోర్ట్ వల్లే NDA అధికారంలోకి వచ్చిందని, APకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు. పోలవరంపై శ్వేతపత్రం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా మేం పోరాడుతాం. మాకు మంచి భవిష్యత్తు ఉంది’ అని మీడియాతో షర్మిల అన్నారు.
క్రికెట్లో ‘ఫ్యాబ్ 4’గా పిలిచే కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, రూట్ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన వీరు ప్రస్తుతం ఓ మాదిరి ప్రదర్శన ఇస్తున్నారు. అలాగే మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా కొనసాగడం లేదు. ప్రస్తుతం వీరిలో ఎవరూ కెప్టెన్సీ కూడా చేయడం లేదు. ఈ నలుగురూ కెప్టెన్సీ చేయకపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి. ఒకప్పటిలా కసిగా పరుగులు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.