News June 17, 2024

పార్టీ నేతలతో జగన్ భేటీ 22కు వాయిదా

image

AP: వైసీపీ MLAలు, పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న కీలక భేటీ ఈ నెల 22కు వాయిదా పడింది. తొలుత ఈ నెల 19న <<13457239>>సమావేశం<<>> జరుగుతుందని పార్టీ వర్గాలు తెలపగా, అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు పేర్కొన్నాయి. ఎన్నికల్లో దారుణ ఓటమి, భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

News June 17, 2024

గ్యారీ నీ టైమ్ వేస్ట్ చేసుకోకు.. ఇండియాకు కోచ్‌గా వచ్చేయ్: భజ్జీ

image

పాకిస్థాన్ జట్టులో ఐక్యత లేదన్న ఆ టీమ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ హర్భజన్ ఏకీభవించారు. ‘గ్యారీ నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. తిరిగి టీమ్ ఇండియాకు కోచ్‌గా వచ్చేయ్. నువ్వొక అరుదైన వజ్రానివి. గొప్ప కోచ్‌వి, మెంటార్‌వి. భారత్ 2011 ప్రపంచకప్ గెలవడంలో నీది కీలకపాత్ర. జట్టులో అందరికీ స్నేహితుడిగా ఉంటూ ముందుకు నడిపించావ్’ అని భజ్జీ ఈ సౌతాఫ్రికా మాజీ దిగ్గజాన్ని ఆహ్వానించారు.

News June 17, 2024

ఒక్క నిర్ణయంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు!

image

VOLVO కంపెనీ పరోక్షంగా లక్షల మంది ప్రాణాలను కాపాడిందనే విషయం మీకు తెలుసా? వోల్వో ఇంజినీర్ నిల్స్ బోహ్లిన్ 1959లో అత్యాధునిక థ్రీపాయింట్ సీట్ బెల్టును అభివృద్ధి చేశారు. ఇతర కంపెనీల వాహనాల్లో ప్రయాణించే వారు కూడా సీట్ బెల్టు ధరించి సురక్షితంగా ఉండాలని పేటెంట్‌ను అందరికీ ఉచితంగా అందజేశారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని కోట్లాది ప్రయాణికులకు మేలు చేసింది.

News June 17, 2024

ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. 4కి 4 ఓవర్లు మెయిడిన్

image

ప్రపంచ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. NZ బౌలర్ ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. 4కి 4 ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. అంతేకాదు 3 వికెట్లూ పడగొట్టారు. అతడి గణాంకాలు 4-4-0-3గా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే. పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచులో కివీస్ పేస్ బౌలర్ ఈ రికార్డు అందుకున్నారు. గతంలో కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి, 2 వికెట్లు తీశారు.

News June 17, 2024

చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: అచ్చెన్నాయుడు

image

AP: తమను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. CM చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతూ.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి జిల్లాకు అవసరమైన నిధులు తెస్తానన్నారు.

News June 17, 2024

24 బంతుల్లో 21 డాట్ బాల్స్.. బంగ్లా బౌలర్ రికార్డు

image

T20WCలో నేపాల్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్ హసన్ రికార్డు సృష్టించారు. 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అతను రెండు మెయిడిన్లు సహా 21 డాట్ బాల్స్ వేశారు. WC హిస్టరీలో ఇవే అత్యధికం. గతంలో బార్ట్‌మన్(SA)vsSL, బౌల్ట్(కివీస్)vsఉగాండా, ఫెర్గూసన్(కివీస్)vs ఉగాండాపై 20 డాట్ బాల్స్ వేశారు. కాగా నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ <<13455375>>విజయం<<>> సాధించింది.

News June 17, 2024

NEET పేపర్ లీక్ ఆరోపణలు.. సీబీఐ మాజీ జేడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

NEET పేపర్ లీక్ అయ్యిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటమ్ బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు’ అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీలో రాశారని పేర్కొన్నారు.

News June 17, 2024

రైల్వే మంత్రి రీల్స్ చేయడంలో బీజీ: కాంగ్రెస్

image

బెంగాల్‌లో కాంచన్‌జంఘా, గూడ్స్ రైళ్ల ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ‘ఆయన రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రజల రక్షణ గురించి పట్టించుకునే సమయం లేదు’ అని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే విమర్శించారు. కాగా రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, పనుల పునరుద్ధరణపైనే తమ దృష్టి ఉందని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.

News June 17, 2024

సంచలనం.. 27 బంతుల్లోనే సెంచరీ

image

T20 క్రికెట్ హిస్టరీలో సంచలనం నమోదైంది. ఈస్టోనియా బ్యాటర్ సాహిల్ చౌహాన్ సైప్రస్ జట్టుపై 27 బంతుల్లోనే సెంచరీ బాదారు. మొత్తంగా 41 బంతుల్లో 144* రన్స్ చేశారు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. షార్ట్ ఫార్మాట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అలాగే ఒక ఇన్నింగ్సులో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డునూ ఆయన సొంతం చేసుకున్నారు. గతంలో గేల్(RCB) 30(vsపుణే), పంత్(ఢిల్లీ) 32(vsహిమాచల్) బంతుల్లో శతకాలు బాదారు.

News June 17, 2024

వధువును వెతకలేకపోయిన మ్యాట్రిమొనీ.. వ్యక్తికి రూ.25వేల పరిహారం

image

తనకు నిర్ణీత సమయంలో వధువును వెతకడంలో కేరళ మ్యాట్రిమొనీ సంస్థ విఫలమైందంటూ ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 2019 జనవరిలో తాను ఫీజు చెల్లిస్తే నెలలు గడిచినా సంస్థ స్పందించలేదని అతను తెలిపారు. ఫిర్యాదుదారుడికి మ్యాట్రిమొనీ సరైన సేవలు అందించలేదని న్యాయమూర్తి గుర్తించారు. అతను చెల్లించిన రూ.4,100+వడ్డీ, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద రూ.3,000 ఇవ్వాలని ఆదేశించారు.