News January 10, 2025

నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ

image

AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 10, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

News January 10, 2025

బీజేపీ నేత ఇంట్లో మొస‌ళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్‌

image

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన BJP Ex MLA హ‌ర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయ‌గా ₹3 కోట్ల డ‌బ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొస‌ళ్లు దొర‌క‌డంతో IT అధికారులు అవాక్క‌య్యారు. సాగ‌ర్ న‌గ‌రంలో హ‌ర్వంశ్ సింగ్‌తోపాటు బీడీ వ్యాపార భాగ‌స్వామి రాజేశ్ కేశ‌ర్వాని ఇళ్ల‌లోనూ సోదాలు నిర్వ‌హించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. రాజేశ్ ఒక్క‌డే ₹140 కోట్లు ఎగ్గొట్టిన‌ట్టు తెలిపారు.

News January 10, 2025

నేడు హైదరాబాద్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా తిరుపతి తొక్కిసలాటతో మేకర్స్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

News January 10, 2025

విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు

image

యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన కామెంట్స్ చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పటి కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 WCలు గెలిచిన, క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన యువీకి టైమ్ ఇవ్వలేదు’ అని తెలిపారు.

News January 10, 2025

మహా కుంభమేళాలో ఈ బాబాలు స్పెషల్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 12 పుష్కరాల తర్వాత జరగనుండటంతో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు, సాధువులు, అఘోరాలు నదీ స్నానానికి వెళ్తున్నారు. అయితే, ఇందులో రోజుకు పది కప్పుల టీ తాగుతూ జీవనం సాగిస్తున్న ‘చాయ్ వాలే బాబా’, తలపై వరి, శనగ మొక్కలను పెంచుతున్న అనాజ్ వాలే బాబా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

News January 10, 2025

PHOTOS: వైకుంఠ ఏకాదశి స్పెషల్

image

TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యాదగిరి గుట్ట, భద్రాచలం, నిజామాబాద్ వెంకటేశ్వర స్వామి, వేములవాడ రాజన్న, భువనగిరి స్వర్ణగిరి తదితర ఆలయాల్లో సందడి నెలకొంది.

News January 10, 2025

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్

image

AP: పోక్సో కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది.

News January 10, 2025

సంక్రాంతి బస్సులపై ఇక్కడిలా.. అక్కడలా!

image

సంక్రాంతికి APSRTC 7,200, TGSRTC 6,432 బస్సులు నడుపుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉండేలా చర్యలు తీసుకుంటామంది. అటు, TGSRTC స్పెషల్ సర్వీసుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్వీసుల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.

News January 10, 2025

ఇంటర్ విద్యార్థి.. స్కూళ్లకు 23 సార్లు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలోని ప‌లు పాఠ‌శాల‌ల‌కు ఇటీవ‌ల వ‌చ్చిన 23 బాంబు బెదిరింపుల‌ను ఓ క్లాస్ 12 విద్యార్థి పంపిన‌ట్టుగా పోలీసులు నిర్ధారించారు. గ‌తంలోనూ అనేక బెదిరింపు సందేశాలు పంపిన‌ట్టు సదరు విద్యార్థి అంగీక‌రించాడ‌ని డీసీపీ సౌత్ అంకిత్ చౌహాన్ తెలిపారు. ప‌రీక్ష‌లు రాయ‌కుండా త‌ప్పించుకోవ‌డానికే ఈ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పేర్కొన్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి పరీక్షలు రద్దు చేస్తారని భావించినట్లు చెప్పారు.