News October 1, 2024

Stock Market: బజాజ్ ట్విన్స్ అదుర్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిన్నటి క్రాష్‌ నుంచి కాస్త కోలుకున్నాయి. BSE సెన్సెక్స్ 84,416 (+122), NSE నిఫ్టీ 25,829 (+18) వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ట్విన్స్, ఇన్ఫీ అదరగొడుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్, హిందాల్కో, JSW స్టీల్, సన్ ఫార్మా టాప్ లూజర్స్. IT, PSU బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లకు గిరాకీ పెరిగింది. మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

News October 1, 2024

‘పడవలు, లడ్డూ, నటి’.. కాదేదీ రాజకీయానికి అతీతం: అంబటి

image

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో విమర్శలు గుప్పించారు. ‘వరదలో పడవలు, లడ్డూ ప్రసాదం, ముంబై నటి.. కాదేదీ రాజకీయానికి అతీతం’ అని రాసుకొచ్చారు. వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు కొట్టుకువచ్చిన పడవలు, శ్రీవారి లడ్డూ అంశం, నటి కాదంబరీ వ్యవహారాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వీటితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

News October 1, 2024

ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు?

image

AP: ప్రజలపై రూ.8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మోత పడనుంది. యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.19 వరకు భారం పడొచ్చని అంచనా. మూడు డిస్కంలు దాఖలుచేసిన ప్రతిపాదనలపై APERC ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ ఛార్జీల వసూలుకు NOVలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు షురూ అయింది.

News October 1, 2024

CODపై ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్‌ని చంపేశాడు

image

ఐఫోన్‌పై పిచ్చి హత్యకు కారణమైంది. UPలోని చిన్‌హాట్‌‌కు చెందిన గజానన్ ఫ్లిప్‌కార్ట్‌లో COD(క్యాష్ ఆన్ డెలివరీ) ఆప్షన్‌ను ఎంచుకొని ₹1.5లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ భారత్ సాహూకు డబ్బు ఇవ్వకపోగా అతడిని తన మిత్రుడితో కలిసి హతమార్చాడు. డెడ్‌బాడీని కాలువలో పడేశాడు. సాహూ కనిపించడం లేదని అతడి కుటుంబం మిస్సింగ్ కేసు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

News October 1, 2024

ఒంటరి జీవితంవైపు వృద్ధుల మొగ్గు

image

జీవిత చరమాంకంలో ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు ‘ఏజ్‌వెల్ ఫౌండేషన్’ అధ్యయనం వెల్లడించింది. ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యం పెరగడమే కారణమని తెలిపింది. దేశంలో 10వేల మంది వృద్ధులపై సర్వే చేయగా 14.3% మంది ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య పట్టణాల్లో 15%, గ్రామాల్లో 13.4 శాతంగా ఉంది. వీరిలో 46.9% మంది సంతోషంగా ఉన్నట్లు చెప్పగా, 41.5% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

News October 1, 2024

ముగిసిన నైరుతి.. మునిగిన రాష్ట్రాలు

image

నైరుతి రుతుపవనాల 4 నెలల సీజన్ నిన్నటితో ముగిసింది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 868.8MMకుగాను 934.8MM(8శాతం అధికం) నమోదైంది. కేరళ, AP, TG, అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, బిహార్, యూపీ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సీజన్‌లో ఏకంగా 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. APలో సాధారణం కంటే 18.6 శాతం అధిక వానలు కురిసినా 42 మండలాల్లో వర్షాభావం నెలకొనడం గమనార్హం.

News October 1, 2024

నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

image

బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరుతూ తన లైసెన్స్‌డ్ గన్‌ను బాక్సులో పెడుతుండగా కిందపడింది. అది పొరపాటున పేలడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

News October 1, 2024

మద్యం షాపులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

image

AP: 3,396 ప్రైవేట్ <<14238214>>లిక్కర్<<>> షాపులకు ఈరోజు ఉ.11 గం. నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా DD తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాలి. ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. ఆ రోజు ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి, 12 నుంచి ప్రైవేట్ దుకాణాలు ప్రారంభమవుతాయి.

News October 1, 2024

‘నా భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. చనిపోతున్నా’

image

యూపీ ఝాన్సీకి చెందిన బజాజ్ ఫైనాన్స్ ఏరియా మేనేజర్ తరుణ్ సక్సేనా (42) పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ‘2 నెలల నుంచి EMI కలెక్షన్ల టార్గెట్ పెడుతున్నారు. రీచ్ కాకుంటే జీతం కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. 45 రోజులుగా నాకు నిద్ర లేదు. పిల్లల ఏడాది స్కూల్ ఫీజు కట్టేశా. నా భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అమ్మానాన్న. నేను చనిపోతున్నా’ అని సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News October 1, 2024

కూతురుకు పెళ్లి చేసిన సద్గురు ఇతరులకెందుకు సన్యాసం ఇస్తున్నారు: కోర్టు

image

కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్ ఇతర యువతుల్ని సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తన ఇద్దరు కుమార్తెలను బ్రెయిన్‌వాష్ చేసి ఇషా సెంటర్లో పర్మనెంట్‌గా ఉంచారని Rtd. ప్రొఫెసర్ కామరాజు వేసిన HCP పిటిషన్‌ను సోమవారం విచారించింది. ఆధ్యాత్మిక జీవితంలో ఎవర్నీ ద్వేషించొద్దన్న వైఖరి పేరెంట్స్‌పై ఎందుకు కనిపించడం లేదని ఆ కుమార్తెలను ప్రశ్నించింది.