News October 1, 2024

4 నెలల వయసులో చిన్నారికి పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు

image

తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.

News October 1, 2024

మూసీ శుద్ధీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణశాసనమే: కోమటిరెడ్డి

image

TG: మూసీ నది శుద్ధీకరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ విష రసాయనాలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు, కాయగూరలను ఎవరూ కొనని పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుద్ధీకరణ కోసం ముందడుగు వేస్తుంటే రోజుకో కుట్రతో BRS రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణం అని విమర్శించారు.

News October 1, 2024

తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?

image

TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్‌సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్‌రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్‌రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

News October 1, 2024

YELLOW ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. <<14239007>>APలో ఈ జిల్లాల్లో వర్షాలు.<<>>

News October 1, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.

News October 1, 2024

20న పోలవరం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్

image

AP: పోలవరంలో కీలకమైన డిజైన్లు, నిర్మాణ పనులపై ఈ నెల 20న కేంద్ర జల సంఘం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్ నిర్వహించనుంది. డయాఫ్రంవాల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీకి అడ్డుకట్ట వేయడం తదితర అంశాలపై అంతర్జాతీయ నిపుణులు, ఉన్నతాధికారులు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జులై వరకు చేయాల్సిన పనుల షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.

News October 1, 2024

పత్తి క్వింటాల్ రూ.7,521.. నేటి నుంచి కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లను CCI ప్రారంభించనుంది. మొత్తంగా 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధరను చెల్లించనుంది. కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతుంది. పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లిచ్చిన నమోదుపత్రంతో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.

News October 1, 2024

IIScలో రిజర్వేషన్ కటాఫ్‌పై నెట్టింట చర్చ

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో అడ్మిషన్ కోసం రాసే JAM రిజర్వేషన్ కటాఫ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జనరల్ కేటగిరీ విద్యార్థికి 76వ ర్యాంకు వచ్చినా సీటు రాదని, ST కేటగిరీలో 4వేల ర్యాంకు వచ్చినా అడ్మిషన్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏ ర్యాంకు విద్యార్థి మెరుగైన పరిశోధన చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పరిశోధన రంగంలోనైనా మెరిట్ చూడాలంటున్నారు.

News October 1, 2024

పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు

image

ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా రేట్లను పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందు LPG ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది.

News October 1, 2024

హెజ్బొల్లా రాజకీయ పార్టీ: ఇరాన్

image

హెజ్బొల్లా టెర్రరిస్టు గ్రూప్ కాదని, అదో రాజకీయ పార్టీ అని భారత్‌లో ఇరాన్ అంబాసిడర్ Dr.ఇరాజ్ ఇలాహీ అన్నారు. తమ రక్తపాతం, విధ్వంసాన్ని జస్టిఫై చేసుకొనేందుకే ఇజ్రాయెల్ దానిని టెర్రరిస్టు గ్రూప్‌గా ముద్ర వేస్తోందన్నారు. ‘హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం ముస్లిములు, లెబనాన్‌కే కాదు ప్రపంచ మానవాళికే భారీ నష్టం. ఆయనో గ్రేట్ లీడర్, పొలిటీషియన్. ప్రపంచంలో అందరికీ తెలియడం చిన్న విషయం కాదు’ అని అన్నారు.