News January 9, 2025

రేపటి నుంచి సెలవులు

image

APలోని స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరకు సెలవులు ఉంటాయి. 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. కాలేజీలకు సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? కామెంట్ చేయండి.

News January 9, 2025

కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న BRS నేతలు

image

TG: ACB విచారణ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్ సోదరి, MLC కవిత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆమెతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

News January 9, 2025

‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ అనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కావాల్సి ఉంది. బాబీ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.

News January 9, 2025

సంక్రాంతి: ఫాస్టాగ్ చెక్ చేసుకోని బయల్దేరండి!

image

సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఫాస్టాగ్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. కేవైసీ చేయించకపోయినా, మినిమం బ్యాలెన్స్ లేకున్నా బ్లాక్ లిస్టులో పడి, వాహనం ముందుకు కదలదు. అప్పటికప్పుడు రీఛార్జ్ చేసినా యాక్టివేట్ అయ్యేందుకు 15 నిమిషాల టైమ్ పడుతుంది.
>>SHARE IT

News January 9, 2025

తిరుమల తొక్కిసలాట.. తప్పెవరిది?

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో తప్పెవరిది అనేదానిపై చర్చ జరుగుతోంది. టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు. ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు. టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది.

News January 9, 2025

అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశాం..

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో KTR చెప్పినట్లే తాము చేశామని IAS అర్వింద్ కుమార్, BLN రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అర్వింద్‌ను ఏసీబీ, రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించాయి. విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలొస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ చెప్పినట్లు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్తమాత్రుడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

News January 9, 2025

తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.

News January 9, 2025

బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నారు?

image

కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత తినకూడదు. ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా టిఫిన్ చేస్తే గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి.

News January 9, 2025

హనీరోజ్‌ను వేధించిన బిజినెస్‌మ్యాన్ అరెస్ట్

image

హీరోయిన్ హనీరోజ్‌ను <<15073430>>వేధించిన<<>> ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీరోజ్‌ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.

News January 9, 2025

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం

image

AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.