News October 1, 2024

‘జగనన్న తోడు’ స్కీమ్ పేరు మార్పు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. ‘జగనన్న తోడు’ స్కీమ్‌ పేరును ‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు.

News October 1, 2024

ఉత్కంఠగా టెస్టు.. ఫలితం తేలేనా?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి టెస్టు నేడు ముగియనుంది. వర్షం వల్ల 2రోజులకుపైగా ఆట సాధ్యం కాకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టమని అంతా భావించారు. కానీ రోహిత్‌సేన దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 5వ రోజు మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. తొలి ఇన్నింగ్స్‌లో 233 రన్స్ చేసిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 26/2తో 26 పరుగులు వెనకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9 చేసింది. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు?

News October 1, 2024

ప్రైవేట్ మద్యం దుకాణాలు.. రూ.2 లక్షలు చెల్లిస్తే..

image

AP: ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి, ప్రైవేటుకు అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి అక్టోబర్ 9 వరకు 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దానికి రూ.2 లక్షల చొప్పున చెల్లించాలి. 11న లాటరీ తీస్తారు. 12 నుంచి ప్రైవేట్ షాపులు తెరుచుకుంటాయి. 10 రకాల పన్నులను 6కి తగ్గించడంతో రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు.

News October 1, 2024

4లోగా అందరి అకౌంట్లలో డబ్బులు జమ: సీఎం

image

AP: తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడలేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 4వ తేదీలోగా అందరికీ పరిహారం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో అసంతృప్తి ఉండకూడదన్నారు. అకౌంట్ మనుగడలో లేకపోవడం, ఆధార్ లింక్ కాకపోవడం, ఖాతా నంబర్ తప్పుగా నమోదవడం తదితర కారణాలతో 22,185 మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.

News October 1, 2024

అరుదైన క్లబ్‌లో చేరిన రవీంద్ర జడేజా

image

టెస్ట్ క్రికెట్‌లో 3000 రన్స్ చేయడంతో పాటు 300 వికెట్లు తీసిన 11వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచారు. BANతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనతను సాధించారు. అతని కంటే ముందు ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హ్యాడ్లీ, ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్, చమిందా వాస్, పొలాక్, వెటోరి, బ్రాడ్, అశ్విన్ ఈ లిస్టులో చేరారు. అలాగే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన తొలి ఇండియన్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జడేజా రికార్డు సృష్టించారు.

News October 1, 2024

APPSC ఛైర్‌పర్సన్‌గా అనురాధ?

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో 3 నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు ఫైల్ చేరినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఏపీ తొలి నిఘా చీఫ్‌గా ఆమె పనిచేశారు. తర్వాత పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి గతేడాది పదవీ విరమణ చేశారు.

News October 1, 2024

DSC: నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డీఎస్సీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ తీసుకుని, వాటి ఆధారంగా పోస్టింగ్స్ ఇస్తారు.

News October 1, 2024

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఎంతంటే?

image

TG: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా ఈ ఏడాది ₹93,750 చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ వర్తించనుంది. గత ఏడాది ₹85,500 చెల్లించగా, ఈసారి అదనంగా ₹8,250 ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డబ్బులు ఈనెల 7న కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.

News October 1, 2024

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్‌సీన్ స్టేటస్‌ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్‌గా స్టేటస్‌లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్‌డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్‌లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.

News October 1, 2024

గ్రాండ్‌గా ‘దేవర’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్?

image

Jr.NTR నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా డిసైడ్ కాలేదని సినీవర్గాలు తెలిపాయి. ఫ్యాన్స్ భారీగా రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సక్సెస్ ఈవెంట్‌ను ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.