India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్స్టాలో ఆర్టికల్ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
రాజస్థాన్లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.
స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్వెల్, లివింగ్స్టోన్పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్స్టోన్ RCBకి ఆడుతున్నారు.
వాంఖడేలో MIvsCSK మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.
జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని
తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్ద పీట వేస్తారని హీరోయిన్ సమంత అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారని చెప్పారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదన్నారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాల్లో యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సామ్ తెలిపారు. కాగా ‘ఏమాయ చేసావె’తో ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
యూపీలో జరిగిన మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్గా మార్చారని SPచీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారన్నారు. ఆ సమయంలో యోగిని PM అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనక బీజేపీ పాత్ర ఉంటుందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం 252 ఇన్నింగ్స్ల్లో 67 సార్లు 50+ స్కోర్స్ చేశారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్(66)ను విరాట్ అధిగమించారు. వార్నర్ తర్వాతి స్థానాల్లో ధవన్(53), రోహిత్(45) ఉన్నారు.
హిందువులు కుల వివక్షకు స్వస్తి పలకాలని RSS చీఫ్ మోహన్ భాగవత్ సూచించారు. ‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’ నియమాన్ని అనుసరిస్తూ సమాజహితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. UPలోని అలీగఢ్లో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు పాటిస్తూ మెరుగైన హిందూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వయం సేవకులు ప్రతి ఇంటికి వెళ్లి ఐక్యత, మూలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
IPL: వాంఖడేలో ఇవాళ ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో సోషల్ మీడియా బజ్పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్స్ రిలీజ్ చేసింది. ముంబైకి 36%, చెన్నైకి 64% మంది సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ప్లేయర్ల పరంగా చూస్తే పర్సెంటేజ్ ఇందుకు భిన్నంగా ఉంది. MI ఓపెనర్ రోహిత్కు 51%, CSK కెప్టెన్ ధోనీకి 49% మంది మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది. మరి మీ సపోర్ట్ ఎవరికి? COMMENT
Sorry, no posts matched your criteria.