India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AFG, PAK నుంచి భారత్కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఢిల్లీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ పట్టుకుంది. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో భాగంగా J&K శ్రీనగర్కు చెందిన ఫహీమ్ ఫరూఖ్ను ట్రాప్ చేసి గ్యాంగ్ను ట్రాక్ చేశారు. 1667గ్రా. హెరాయిన్ సహా, ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 10మందిని అరెస్ట్ చేశారు. పబ్జీ గేమ్ ద్వారా కనెక్షన్స్ పెంచుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
పెద్దగా ప్రాధాన్యత లేని డబ్బా రోల్స్లో నటించడం కంటే ఆంటీ, అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని సినీ నటి సిమ్రన్ అన్నారు. ఆంటీ, అమ్మ పాత్రలలో నటించడం కొంతమంది చులకనగా భావిస్తారని, అది సరికాదని అన్నారు. మనం ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కాగా ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో సిమ్రన్ అతిథి పాత్రలో నటించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ‘డెజర్ట్ ఫ్లాగ్ 10’ పేరిట నిర్వహించే మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పాల్గొననున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. మిగ్-2, జాగ్వర్ ఎయిర్క్రాఫ్ట్లను IAF పంపనుంది. US, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతర్, సౌదీ, సౌత్ కొరియా, టర్కీ, UK ఎయిర్ఫోర్సెస్ పాల్గొనే ఈ విన్యాసాలు మే 8 వరకు జరగనున్నాయి.
AP: ప్రభుత్వం రిలీజ్ చేసిన <<16157650>>మెగా డీఎస్సీకి<<>> దరఖాస్తుల సమయంలో ఫీజు కట్టే విషయంలో కొందరు అభ్యర్థులకు గందరగోళం నెలకొంది. గత ఏడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్లో పేర్కొంది. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.
AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.
రాజ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై MH సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇద్దరు కలిస్తే సంతోషమే, విభేదాలను పరిష్కరించుకోవడం మంచి విషయం’ అని సీఎం అన్నారు. కాగా MNSతో పొత్తులపై చర్చలు జరగలేదని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరూ సోదరులని రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్నదమ్ముల బంధం తెగిపోదని అన్నారు.
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనకు సర్జరీ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ హాస్పిటల్లో ఉన్న ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. జనవరి నుంచి రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడినట్లు చెప్పారు. వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరితే ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, మరో 3 వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించారు.
న్యూయార్క్(US)లోని ఓ ఇంట్లో తల్లి, సోదరుడు మృతిచెందగా నాలుగేళ్ల చిన్నారి శవాల మధ్యే వారానికి పైగా గడిపిన హృదయవిదారక ఘటన ఇది. లీసా(38), నాజిర్(8) అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే మరణించారు. లీసా కూతురు ప్రామిస్ ఆ మృతదేహాల మధ్యే ఉండిపోయింది. అసలేం జరిగిందో తెలియని ఆ చిన్నారి కొన్ని రోజులపాటు చాక్లెట్లు తింటూ సర్వైవ్ అయింది. లీసా సోదరి ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.
తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.