News January 8, 2025

ప్రధాని శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టులు

image

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం(రూ.149 కోట్లు), గంగవరం పోర్టు-విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 3, 4 రైల్వే లైన్లు(154 కోట్లు), దువ్వాడ-సింహాచలం(నార్త్) 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం(302 కోట్లు), విశాఖపట్నం-గోపాలపట్నం 3,4 రైల్వే లైన్ల నిర్మాణం(159 కోట్లు), గుత్తి-పెండేకల్లు డబ్లింగ్(352 కోట్లు), గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్(2853 కోట్లు), మహబూబ్‌నగర్-డోన్ డబ్లింగ్, విద్యుదీకరణ(రూ.2208 కోట్లు)

News January 8, 2025

ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులివే

image

చిలకలూరి పేట 6 లేన్ బైపాస్(రూ.907 కోట్లు), నాగార్జున సాగర్-దావులపల్లి హైవే(331 కోట్లు), మడకశిర-సిర 2 లేన్స్(208 కోట్లు), బత్తలపల్లి-ముదిగుబ్బ 4 లేన్లు(536 కోట్లు), రేపల్లె-ఈపూరుపాలెం 2 లేన్లు(786 కోట్లు), గుత్తి-ధర్మవరం రైల్వేలైన్ డబ్లింగ్(998 కోట్లు), విజయవాడ-గుడివాడ-భీమవరం-నరసాపురం-మచిలీపట్నం, గిద్దలూరు-దిగువమెట్టు లైన్ డబ్లింగ్, భీమవరం-నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు (4612 కోట్లు).

News January 8, 2025

ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు: సీఎం చంద్రబాబు

image

AP: వైజాగ్ సమావేశంలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ‘మోదీ అంటే ఓ విశ్వాసం. ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు. రూ. 2.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ఎన్నికలయ్యాక మొదటిసారిగా నరేంద్ర మోదీ ఏపీకి వచ్చారు. వచ్చిన వెంటనే ఎన్నో పెట్టుబడుల్ని అందించారు. ఆయన ప్రపంచం మెచ్చే నాయకుడు. దేశానికెప్పుడూ ఆయనే ప్రధానిగా ఉంటారు’ అని కొనియాడారు.

News January 8, 2025

అంధకార ఆంధ్రప్రదేశ్‌కు మోదీ రాకతో వెలుగులు: పవన్

image

AP: గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఆరోపించారు. ఇవాళ మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోదీ వెలుగులు నింపుతున్నారని వెల్లడించారు.

News January 8, 2025

‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ విడుదల వాయిదా

image

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ ముందుగా ప్రకటించినట్లు ఈనెల 11న విడుదల కావట్లేదని మేకర్స్ ప్రకటించారు. 20 నిమిషాల వీడియోను కలపడంలో టెక్నికల్ సమస్యలు ఏర్పడటంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 17నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విడుదల కానున్నాయి.

News January 8, 2025

APపై గోదావరి రివర్ బోర్డుకు TG ఫిర్యాదు

image

TG: పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఏపీ, కేంద్రం, గోదావరి రివర్ బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. ‘వరద జలాల ఆధారంగా గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుంది. నీటి వాటాలు తేలేవరకూ బనకచర్ల పనులు నిలిపేయాలి. ఇందుకు కేంద్రం, గోదావరి బోర్డు చర్యలు తీసుకోవాలి’ అని తెలంగాణ డిమాండ్ చేసింది.

News January 8, 2025

దేశాన్ని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారు: పవన్ కళ్యాణ్

image

AP: భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని చెప్పారు. NDA ప్రభుత్వం గెలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

News January 8, 2025

గ్రూప్-3 కీ విడుదల

image

TG: గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి ఇవాళ ‘కీ’ని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఇంటర్వ్యూ ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏడాది వ్యవధిలో, లేని వాటిని 6-8 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించింది. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని పేర్కొంది.

News January 8, 2025

నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, SSC ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

News January 8, 2025

11వేల రుద్రాక్షలను ధరించి మహాకుంభమేళాకు వచ్చిన బాబా

image

మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, రుషులు, సాధువులు, బాబాలు, అఘోరాలు నదీ స్నానం చేసేందుకు ప్రయాగరాజ్‌కు వెళ్తున్నారు. అయితే, అక్కడికి వచ్చిన
ఓ రుద్రాక్ష బాబా ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏకంగా 30 కేజీల బరువున్న 11వేల రుద్రాక్షలను ధరించారు. తనను ప్రజలు రుద్రాక్ష బాబా అని పిలుస్తారని, చాలాకాలంగా వీటిని ధరిస్తున్నట్లు ఆయన తెలిపారు.